E-Paper
Advertisement

Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
Advertisement

Five Army Soldiers Died in Ladakh(Telugu news live): కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో విషాద ఘటన జరిగింది. LAC వద్ద యుద్ధట్యాంకుల విన్యాసాలు చేస్తున్న సైనికులు మృతి చెందారు. T-72 యుద్ధట్యాంక్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. అందులో ఉన్న ఐదుగురు జవాన్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. జవాన్ల కోసం గాలించగా వారంతా మరణించినట్లు తెలిసింది.

లేహ్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో మందిర్ మోర్హ్ లోని బోధి నదిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఆర్మీ విన్యాసాలలో భాగంగా.. యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా.. వరదల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగి యుద్ధ ట్యాంక్ మునిగిపోయింది. దురదృష్టవశాత్తు అందులో ఉన్న ఐదుగురు జవాన్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు. మృతి చెందిన సైనికుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

నదిని దాటుతూ.. ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు జవాన్లు మృతి చెందడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. దేశంకోసం సైనికులు చేసిన సేవలను మరచిపోలేమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు X వేదికగా పోస్ట్ చేశారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×