E-Paper
Advertisement

Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

Five Army Soldiers Died in Ladakh(Telugu news live): కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో విషాద ఘటన జరిగింది. LAC వద్ద యుద్ధట్యాంకుల విన్యాసాలు చేస్తున్న సైనికులు మృతి చెందారు. T-72 యుద్ధట్యాంక్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. అందులో ఉన్న ఐదుగురు జవాన్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. జవాన్ల కోసం గాలించగా వారంతా మరణించినట్లు తెలిసింది.

లేహ్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో మందిర్ మోర్హ్ లోని బోధి నదిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఆర్మీ విన్యాసాలలో భాగంగా.. యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా.. వరదల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగి యుద్ధ ట్యాంక్ మునిగిపోయింది. దురదృష్టవశాత్తు అందులో ఉన్న ఐదుగురు జవాన్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు. మృతి చెందిన సైనికుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నదిని దాటుతూ.. ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు జవాన్లు మృతి చెందడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. దేశంకోసం సైనికులు చేసిన సేవలను మరచిపోలేమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు X వేదికగా పోస్ట్ చేశారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×