Terrorist Attack on Security Forces in Jammu Kashmir: జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. సూరన్ కోట్ ప్రాంతంలో వాహనాలపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులకు గాయాలవ్వగా.. ఒకరు మృతి చెందారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భారత వాయుసేనకు సంబంధించిన వాహనంతో పాటు మరో వాహనంపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఒకరు చికిత్స పొందుతూ మరణించగా.. గాయపడిన మిగతా జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: గుజరాత్లో దారుణం, ప్రియురాలి కోసం పార్సిల్ బాంబ్.. ఏం జరిగిందంటే..
ఈ ఉగ్రదాడిని మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. వీరమరణం పొందిన జవాన్ కు సంతాపం తెలిపి, అతని కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఇదొక పిరికిపంద చర్య అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో దశలవారిగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సైనికులపై ఉగ్రదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. జమ్ముకశ్మీర్ లోనూ ఐదు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
जम्मू कश्मीर के पुंछ में हमारी सेना के काफिले पर कायराना और दुस्साहसी आतंकी हमला बहुत ही शर्मनाक है, दुखद है।
शहीद जवान को मैं अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं और उनके शोकसंतप्त परिजनों को संवेदनाएं व्यक्त करता हूं। हमले में घायल जवानों के जल्द से जल्द स्वस्थ होने की आशा…
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2024