BigTV English

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!

Four Died during Cleaning Septic Tank in Uttar Pradesh: వాళ్లు ముగ్గురు కూడా కూలీలుగా పని చేస్తుంటారు. అయితే, వీళ్లు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనికి వెళ్లారు. ఓ ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు అందులోకి వెళ్లారు. అయితే, అందులో నుంచి వచ్చిన విషయవాయువును పీల్చి స్పృహ కోల్పోయారు.


విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు కూడా వారిని కాపాడేందుకు వెళ్లి ఆయన కూడా స్పృహ కోల్పోయాడు. వెంటనే వారిని అందులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతిచెందారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

ఉత్తర్‌ప్రదేశ్ లోని చందౌలిలో ఉన్న న్యూ మహల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించేందుకు ముగ్గురు కూలీలను తీసుకువచ్చారు. అయితే, వారు క్లీన్ చేసేందుకు సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్లారు. క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందులో విషయవాయువు వెలువడడంతో దానిని పీల్చి ఆ ముగ్గురు స్పృహ కోల్పోయారు. విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు వారిని కాపాడేందుకని అతను కూడా అందులోకి దిగాడు. దీంతో అతను కూడా ఆ విషవాయువును పీల్చి స్పృహ కోల్పోయాడు.


Also Read: Delhi High Court : ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో ?

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో వారిని సెప్టిక్ ట్యాంక్ లో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగీ.. వారి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Also Read: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

ఈ ఘటనపై సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. సెప్టిక్ ట్యాంక్ లో విషవాయువు వల్ల ఓనర్ కొడుకుతోపాటు ముగ్గురు కూలీలు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×