BigTV English

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!

Four Died during Cleaning Septic Tank in Uttar Pradesh: వాళ్లు ముగ్గురు కూడా కూలీలుగా పని చేస్తుంటారు. అయితే, వీళ్లు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనికి వెళ్లారు. ఓ ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు అందులోకి వెళ్లారు. అయితే, అందులో నుంచి వచ్చిన విషయవాయువును పీల్చి స్పృహ కోల్పోయారు.


విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు కూడా వారిని కాపాడేందుకు వెళ్లి ఆయన కూడా స్పృహ కోల్పోయాడు. వెంటనే వారిని అందులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతిచెందారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

ఉత్తర్‌ప్రదేశ్ లోని చందౌలిలో ఉన్న న్యూ మహల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించేందుకు ముగ్గురు కూలీలను తీసుకువచ్చారు. అయితే, వారు క్లీన్ చేసేందుకు సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్లారు. క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందులో విషయవాయువు వెలువడడంతో దానిని పీల్చి ఆ ముగ్గురు స్పృహ కోల్పోయారు. విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు వారిని కాపాడేందుకని అతను కూడా అందులోకి దిగాడు. దీంతో అతను కూడా ఆ విషవాయువును పీల్చి స్పృహ కోల్పోయాడు.


Also Read: Delhi High Court : ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో ?

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో వారిని సెప్టిక్ ట్యాంక్ లో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగీ.. వారి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Also Read: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

ఈ ఘటనపై సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. సెప్టిక్ ట్యాంక్ లో విషవాయువు వల్ల ఓనర్ కొడుకుతోపాటు ముగ్గురు కూలీలు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

Tags

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×