E-Paper
Advertisement

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!
Advertisement

Four Died during Cleaning Septic Tank in Uttar Pradesh: వాళ్లు ముగ్గురు కూడా కూలీలుగా పని చేస్తుంటారు. అయితే, వీళ్లు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనికి వెళ్లారు. ఓ ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు అందులోకి వెళ్లారు. అయితే, అందులో నుంచి వచ్చిన విషయవాయువును పీల్చి స్పృహ కోల్పోయారు.

విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు కూడా వారిని కాపాడేందుకు వెళ్లి ఆయన కూడా స్పృహ కోల్పోయాడు. వెంటనే వారిని అందులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతిచెందారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Advertisement

ఉత్తర్‌ప్రదేశ్ లోని చందౌలిలో ఉన్న న్యూ మహల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించేందుకు ముగ్గురు కూలీలను తీసుకువచ్చారు. అయితే, వారు క్లీన్ చేసేందుకు సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్లారు. క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందులో విషయవాయువు వెలువడడంతో దానిని పీల్చి ఆ ముగ్గురు స్పృహ కోల్పోయారు. విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు వారిని కాపాడేందుకని అతను కూడా అందులోకి దిగాడు. దీంతో అతను కూడా ఆ విషవాయువును పీల్చి స్పృహ కోల్పోయాడు.

Also Read: Delhi High Court : ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో ?

Advertisement

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో వారిని సెప్టిక్ ట్యాంక్ లో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగీ.. వారి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Also Read: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

ఈ ఘటనపై సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. సెప్టిక్ ట్యాంక్ లో విషవాయువు వల్ల ఓనర్ కొడుకుతోపాటు ముగ్గురు కూలీలు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

Tags

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×