BigTV English
Advertisement

MP Ravikishan: హిందువులకు గొడ్డుమాంసం లడ్డూలు.. రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Ravikishan: హిందువులకు గొడ్డుమాంసం లడ్డూలు.. రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Ravikishan Comments on Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఓ వైపు ఏపీ డిప్యూసీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష.. మరోవైపు తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం, ఇంకోవైపు ప్రకాష్ రాజ్ విమర్శలతో.. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం తారాస్థాయికి చేరింది. దీనిపై గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకూ అందరూ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.


తాజాగా గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ (రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి) తిరుమల లడ్డూ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్థంతి వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న ఆయన.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. నాడు టీటీడీ ఆలయాలన్ని నడిపినవారు హిందువులు కాదని, వారి హయాంతో తిరుమలకు వచ్చిన భక్తులకు గొడ్డుమాంసంతో చేసిన లడ్డూలను ఇచ్చారని ఆరోపించారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలను కూడా వెంట తీసుకుని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని రవికిషన్ పేర్కొన్నారు.

తిరుమల లడ్డూ కల్తీతో దేశవ్యాప్తంగా అలజడి రేగిందన్న ఎంపీ రవికిషన్.. దీనికోసం పోరాడేందుకు సాధువులు కూడా యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.


కార్తీ జోక్స్.. పవన్ ఫైర్

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించాలని.. ఇటీవలే జరిగిన సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో హీరో కార్తీని అడగగా.. అది చాలా సున్నితమైన విషయమని, దాని గురించి తాను మాట్లాడను అని నవ్వుతూ చెప్పారు. దాంతో లడ్డూ కల్తీ విషయం హాస్యం చేయాల్సిన విషయం కాదంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫైరయ్యారు. లడ్డూ వివాదంపై జోకులు వెసుకుని నవ్వుకుంటున్నారని, దీనిపై పోరాడాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.

 

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×