E-Paper
Advertisement

India Bangladesh Test : క్లీన్‌స్వీప్ చేసిన భారత్..

India Bangladesh Test : క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
Advertisement

India Bangladesh Test : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి.. టీమ్‌ ఇండియా ఆదిలో తడబడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. కష్టాల్లో పడింది.

45 పరుగులు… 4 వికెట్ల ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌… మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో గెలుపు వారివైపే ఉన్నట్టు కనిపించింది. ఆ సమయంలో అయ్యర్‌ 29 పరుగులు, అశ్విన్‌ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ 8వ వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి, జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు భారత బ్యాటర్లలో అక్షర్‌పటేల్‌ ఒక్కడే 34 పరుగులతో రాణించాడు. ఇక బంగ్లా బౌలర్లలో మిరాజ్‌ 5 వికెట్లు తీయగా.. షకీబ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

టెస్టు సిరీస్‌ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ అందుకున్నాడు. అనంతరం యువ ఆటగాడు సౌరభ్‌ కుమార్‌కు అందజేసి.. గతంలో ఎంఎస్ ధోనీ పాటించిన సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్‌ కొనసాగించాడు. రెండో టెస్టులో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్‌ మ్యాన్‌… ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను పుజారా గెలుచుకున్నాడు.

Tags

Related News

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

Big Stories

Advertisement
×