BigTV English
Advertisement

Indo-Pak Tensions: మారని పాక్ వైఖరి.. ప్రధాని ప్రసంగం తర్వాత, సాంబా సెక్టార్‌లో అలజడి

Indo-Pak Tensions: మారని పాక్ వైఖరి.. ప్రధాని ప్రసంగం తర్వాత, సాంబా సెక్టార్‌లో అలజడి

Indo-Pak Tensions: భారత్ విషయంలో పాకిస్థాన్ వైఖరి మారలేదా? యుద్ధానికి రెడీ అవుతోందా? అమెరికా ఒత్తిడి వల్లే అంగీకరించిందా? ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికి జమ్మూకాశ్మీర్‌లో పాక్ డ్రోన్లు ఎంటరయ్యాయి. భారత్ సైన్యం అలర్ట్‌గా ఉండడంతో వాటిని కూల్చివేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? ఇదే చర్చ జోరుగా సాగుతోంది.


భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం రాత్రి సైలెంట్‌గా ఉన్న పాకిస్తాన్ బలగాలు, సోమవారం రాత్రి మాత్రం తన కుటిల బుద్ది బయట పెట్టుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్లు హంగామా చేశాయి. పరిస్థితి గమనించిన భారత ఆర్మీ వాటిని కూల్చివేసింది.

ఆకాశంలో రాత్రి 9 గంటల సమయంలో ఎర్రటి చారలు కనిపించాయి.  వీటిని పసిగట్టిన సైన్యం వాటిని పేల్చివేసింది. ఆ ప్రాంతంలో పేలుడు శబ్దం వినబడిందని స్థానికులు చెబుతున్నారు. పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.


దాయాది దేశంతో చర్చలు గనుక జరిగితే ఉగ్రవాదం నిర్మూలన, పాకస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలపై మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ప్రధాని ప్రసంగం తర్వాత దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. అయినా సోమవారం సాయంత్రం ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు హాట్‌లైన్ ద్వారా దాదాపు అరగంటపాటు జరిగాయి.

ALSO READ: బెదిరింపులకు భయపడేది లేదు, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ఆపరేషన్ సిందూర్..

ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పులకు చోటు ఇవ్వరాదని, బలగాలను తక్షణ కుదించుకోవాలని నిర్ణయించారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగరాదని డిసైడ్ అయ్యారు. అంతలో పాకిస్తాన్ డ్రోన్లు కాశ్మీర్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. భారత సైన్యం అలర్ట్‌గా లేకుంటే నష్టం జరిగేదని అంటున్నారు.

జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సమీపంలో తక్కువ సంఖ్యలో డ్రోన్లు గుర్తించింది సైన్యం. తాజా పరిస్థితి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సాంబా, కథువా, రాజౌరి, జమ్మూలోని అనేక ప్రాంతాలలో విద్యుత్తు నిలిపివేసినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణోదేవి దేవాలయం వద్ద లైట్లు ఆపి వేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్ 740 కిలోమీటర్లు పొడవైన నియంత్రణ రేఖ వెంబడి తరచుగా ఉల్లంఘనలకు పాల్పడుతోంది దాయాది దేశం. జమ్మూ జిల్లాలో సరిహద్దు వెంబడి రాజౌరి, పూంచ్, అఖ్నూర్, పర్గ్వాల్ సెక్టార్‌కు దక్షిణం వైపుకు వ్యాపించింది.  జలంధర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు మాట్లాడుతూ  రాత్రి 9.20 గంటల ప్రాంతంలో మాండ్ గ్రామం సమీపంలో నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.

 

 

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×