BigTV English
Advertisement

ISRO: అప్పటికల్లా అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

ISRO: అప్పటికల్లా అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

International Space Station: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో, అమెరికాకు చెందిన నాసాలు కలిసి చేపడుతున్న మిషన్‌లో భాగంగా భారత వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు. వీరిని వచ్చే ఏడాది పంపిస్తారని తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా భారత వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లుతారని వివరించారు.


గ్రూప్ కెప్టెన్లుగా గుర్తింపు పొందిన శుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలక్రిష్ణన్ నాయర్‌లు ఈ మిషన్ కోసం ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. యాక్జియమ్ స్పేస్ మిషన్ కోసం వీరు అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. శుక్లాను ఈ మిషన్ కోసం ఇస్రో ఎంపిక చేయగా.. ఆయనకు బ్యాకప్‌గా బాలక్రిష్ణన్ నాయర్ ఉంటాడు.

గతేడాది ఆగస్టు 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఈ వేడుకలు ఆగస్టు 23న జరగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ బుధవారం ఈ మేరకు వెల్లడించారు. ‘వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా భారత వ్యోమగామి ఐఎస్ఎస్‌కు వెళ్లుతారు’ అని చెప్పారు.


Also Read: Student Died in Kadapa: కడపలో తీవ్ర విషాదం.. సైకిల్‌పై బడికి వెళ్తుండగా మీద పడిన విద్యుత్ తీగలు.. విద్యార్థి మృతి

చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇస్రో ఆగస్టు 23వ తేదీన విడుదల చేయనుంది. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం ఒక వేయికి మించి ఈవెంట్లు నిర్వహించారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భరత మండపంలో నిర్వహించే జాతీయ అంతరిక్ష దినోత్సవాలకు హాజరుకానున్నారు. భారతీయ అంతరిక్ష హాకథాన్, ఇస్రో రోబొటిక్స్ చాలెంజ్‌లలో గెలుపొందిన వారికి రాష్ట్రపతి ప్రైజులు అందిస్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తొలి రోవర్ భారత అంతరిక్ష కేంద్రం ప్రయోగించినదే కావడం విశేషం.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×