BigTV English
Advertisement

PM Modi – Aircraft : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు

PM Modi – Aircraft : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు

PM Modi – Aircraft : జార్ఘండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi).. తిరుగు ప్రయాణ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో.. జార్ఘండ్ లోని దియోగర్ (Deoghar) విమానాశ్రయంలోనే ప్రధాని విమానాన్ని నిలిపివేశారు. సమస్య ఇంకా పరిష్కారం అవ్వకపోవడంతో.. ప్రధాని కోసం దిల్లీ నుంచి మరో విమానాన్ని అధికారులు జార్ఘండ్‌కు పంపించారు. దాంతో.. ప్రధాని షెడ్యూల్ లో తీవ్రజాప్యం ఏర్పాడినట్లు వెల్లడించారు.


జార్ఘండ్ లో ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా జయంతి వేడుకల సందర్భంగా జన్ జాతీయ గౌరవ్ దివాస్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం నవంబర్ 20న రెండో దశ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో జార్ఘండ్ లో నిర్వహించిన రెండు ర్యాలీల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో ప్రధాని విమానంలో సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించారు. దాంతో.. ప్రయాణాన్ని నిలిపివేసిన అధికారులు, దిల్లీ నుంచి మరో విమానాన్ని తరలిస్తున్నారు.

ఇదే సమయంలో.. దియోగర్ కు 80 కి.మీ దూరంలో రాహుల్ గాంధీ హెలీకాఫ్టర్ టేకాఫ్ కు అనుమతులు లభించలేదు. దాంతో.. ఆయన హెలీకాఫ్టర్.. 45 నిముషాల పాటు నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స రావడం ఆలస్యం అవ్వడంతో.. రాహుల్ హెలీకాఫ్టర్ అంతసేపు నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. అయితే.. ఇందుకు బీజేపీ నే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరోపించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు కల్పించేందుకు బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందంటూ ఆరోపణలు చేసింది. అధికారులు రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధ్యానతనిస్తున్నారని, అందుకే ఇలాంటి ఆటంకాలు సృష్టి్స్తున్నారంటూ ఆరోపించారు.


Also Read : మోడీకి రాహుల్ గాంధీ కౌంట‌ర్.. ఆయ‌న రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు!

అంతకుముందు రోజు తన ర్యాలీలలో ప్రధాని మోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వెనుకబడిన తరగతుల (OBC) వర్గాలకు చెందిన వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాంధీ) ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ గతంలో.. రిజర్వేషన్‌ను బానిసత్వానికి చిహ్నమన్నారంటూ ఆరోపించారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×