Chennai: సమయం, సందర్భం ఏంటన్నది కాసేపు పక్కనపెడితే.. బ్యాంక్ మేనేజర్ చెంప ఛెళ్లు మనిపించింది దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవరాలు. కేవలం లిఫ్ట్ పని చేయకపోవడంపై జరిగిన మాటల యుద్ధంలో ఆవేశంతో కుర్చీ నుంచి పైకి లేచి మేనేజర్ని కొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
చెన్నైలో షాకింగ్ ఘటన- ఆరు రోజుల కిందట అనగా జులై 20న చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్రాంచ్ ఉంది. పని నిమిత్తం దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవరాలు కాయల్విళి ఆ బ్యాంకుకు వెళ్లారు. అయితే బ్యాంకు భవనంలోని లిఫ్ట్ సరిగా పని చేయలేదు. దీనిపై కాయల్విళి.. ఆ బ్రాంచ్ మేనేజర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ భవనం కాయల్విళికి చెందినదిగా చెబుతున్నారు.
బ్యాంక్ మేనేజర్ని మాజీ సీఎం మనవరాలు- ఇరువురు మధ్య మాటా మాటా పెరగడంతో మేనేజర్ హావభావాలను హేళన చేస్తూ అనుకరించారు ఆమె. ఆ తర్వాత మేనేజర్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా కుర్చీ నుంచి లేచి మేనేజర్ చెంప ఛెళ్లుమణిపించారు. ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ మరో వ్యక్తి ఉన్నారు. సదరు మహిళను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన కూడా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
కేసు నమోదు, పోలీసుల విచారణ- ఈ ఘటనపై ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు విచారణ నేపథ్యంలో శనివారం బ్యాంకుకు వచ్చి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజ్ పరిశీలించారు. దీంతో ఆ ఘటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మేనేజర్పై దాడి చేసి, బెదిరించిన ఆరోపణలపై కాయల్విళిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అన్నట్లు అసలు విషయానికి వద్దాం. కాయల్విళి ఎవరోకాదు.. తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవరాలు, మాజీ కేంద్ర మంత్రి అళగిరి కూతురు.
ALSO READ: ఢిల్లీ కేంద్రంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రేసులో కీలక నేత!
On 21.07.2026, Namachivayam, Chief Manager, SBI RBO-II, lodged a complaint stating that Adyar SBI-NRI Branch Manager Harsheen Singh had informed the building owner, Kayalvizhi Alagiri, regarding rectification of a faulty lift as her representative failed to respond. Aggrieved by…
— Stalin SP (@Stalin__SP) July 25, 2026