E-Paper
Advertisement

Arvind Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఏదైనా చేస్తుంది .. బీజేపీ పై కేజ్రీవాల్‌ ఫైర్‌..

Arvind Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఏదైనా చేస్తుంది .. బీజేపీ పై కేజ్రీవాల్‌ ఫైర్‌..
Advertisement

Delhi CM Arvind Kejriwal fire on BJP: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ప్రసంగించిన కేజ్రీవాల్ బీజేపీ నిజస్వరూపాన్ని దేవుడే ప్రజల ముందు ఉంచాడన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల్లో బీజేపీ గెలవదనే ఘటన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక నిరూపించిందని కేజ్రీవాల్ అన్నారు. జనవరి 30 నాటి ఎన్నిక ఫలితాన్ని పక్కనపెడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాషాయ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు.

Advertisement

ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగానే కూల్చే ప్రయత్నాలకు పాల్పడుతోందని బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ పార్టీ అధికారం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరికీ ధర్మమే గెలుస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

Read more: కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు.. ‘ఆల్ ఈజ్ వెల్’

Advertisement

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై స్పందించిన ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులను నగరంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించకపోవడమే కాక వారి సమస్యలను కూడా వినడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×