E-Paper
Advertisement

Arvind Kejriwal: ఆప్ అంతం కోసం బీజేపీ ప్రయత్నం: కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆప్ అంతం కోసం బీజేపీ ప్రయత్నం: కేజ్రీవాల్
Advertisement

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. బిభవ్‌ కుమార్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలతో నిరసన చేపట్టారు. పోలీసులు 144 సెక్షన్ విధించినా లెక్కచేయలేదు. తమను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆప్ నేతలను అరెస్ట్ చేయాడానికి మోదీ భయపడుతున్నారని వారు విమర్శించారు.

కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలను పోలీసులను అడ్డుకోవడంతో.. బీజేపీ ఆఫీస్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆప్ నేతలు తిరిగి తమ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. బీజేపీ, ప్రధాని మోదీలపై ధ్వజమెత్తారు. ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ఆపరేషన్‌ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు.

Advertisement

ఆప్ ను అంతం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. అందుకే ఆప్ నేతలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేయాలని చూస్తున్నారని వెల్లడించారు.

తను బెయిల్ వచ్చిన నాటి నుంచి మోదీ ఆప్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దేశానికి మంచి పనులు చేస్తోంది ఆప్ అని ఆయన అన్నారు. ఆప్ చేస్తున్న మంచి పనుల గురించి దేశమంతా చర్చింకుంటున్నారని చెప్పారు. ఆప్ కు బీజేపీ నుంచి ముప్పు ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Advertisement

Also Read: బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్

తమ పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని.. కావాలంటే అందరినీ ఒకే సారి అరెస్ట్ చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో బిభవ్ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×