E-Paper
Advertisement

Kerala Government: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

Kerala Government: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

Kerala Government: మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆర్టిస్టులు ఆరోపించడం తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు పోలీస్ ఉన్నతాధికారులతో కూడిన ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.

Also Read: తెలుగు ఎంతో అద్భుతమైన భాష.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ ఓ నటి ఆరోపించారు. ఇదే సమయంలో ప్రముఖ డైరెక్టర్, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీకి చెందిన పలువురు రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన కేరళ ప్రభుత్వం .. పోలీసు అధికారులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఇందుకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×