E-Paper
Advertisement

Today’s Weather Report: బాబోయ్ ఎండలు.. కేరళలో ఎల్లో అలర్ట్..!

Today’s Weather Report: బాబోయ్ ఎండలు.. కేరళలో ఎల్లో అలర్ట్..!
Advertisement

Today Weather Update: ఫిబ్రవరి నెల దాటనే లేదు.. అప్పుడే కాక మొదలైంది. ఈ సారి వేసవిలో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువే ఉండొచ్చన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో జనంలో ఆందోళన మొదలైంది.

కేరళలో గత వారం నుంచే ఆ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే టెంపరేచర్ నమోదవుతోంది. పెరుగుతున్న ఎండలకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు కేరళవాసులకు భారత వాతావరణ శాఖ(IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో పలు సూచనలు చేసింది.

Advertisement

కోజికోడ్‌లో 37 డిగ్రీల సెల్సియస్, కన్నూర్, తిరువనంతపురం జిల్లాల్లో 36 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరాయి. వడదెబ్బ, సన్‌బర్న్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Read More: మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !

Advertisement

మార్చి-మే నెలల మధ్య సూపర్ ఎల్‌నినో వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఎన్‌వోఏ(నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) ఇప్పటికే హెచ్చరించింది. మార్చి నుంచి మే వరకు వేసవికాలం. ఆ సమయంలోనే ఎల్‌నినో తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం 75 శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1972–73, 1982–83, 1997–98, అలాగే 2015–16లోనూ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అనేక దేశాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కరవు, వరదల వంటి విపత్తులను ఎదుర్కొన్నాయి. 2024లోనూ అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని అంచనా. అందుకే ఈ వేసవిని గట్టెక్కెదెలా బాబోయ్ అని బెంబేలెత్తుతున్నారు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×