BigTV English
Advertisement

Lawyer Cybercrime Phone: భార్యకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన లాయర్.. ఓపెన్ చేయగానే పోలీసులు వచ్చి

Lawyer Cybercrime Phone: భార్యకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన లాయర్.. ఓపెన్ చేయగానే పోలీసులు వచ్చి

Lawyer Cybercrime Phone| ఒక లాయర్ తన భార్యకు పెళ్లి రోజు సందర్భంగా ఒక ఖరీదైన గిఫ్ట్‌ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఇచ్చాడు. అది రూ. 49,000 విలువైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్. అది కొత్తగా సీల్ చేసిన బ్రాండ్ ఫోన్ లాగానే ఉంది. GST ఇన్‌వాయిస్‌ ఉంది. ఇవన్నీ చూసి నమ్మి, ఆ ఫోన్‌ను తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. కానీ, ఆ ఫోన్‌ను ఆన్ చేసిన తరువాత పోలీసులు వారికి ఇంటికి వచ్చారు. ఆ ఫోన్ ఒక పెద్ద సైబర్ క్రైమ్ కేసులో ఉపయోగించబడిందని చెప్పారు. ఇదంతా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో జరిగింది. అయితే వారి ఇంటికి వచ్చింది గుజరాత్ పోలీసులు. ఆ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్.. ఆన్‌లైన్ మోసంలో ఉపయోగించిన ఒక ఫోన్‌తో సరిపోలినట్లు పోలీసులు గుర్తించారు.


ఈ ఆరోపణతో ఆశ్చర్యపోయిన ఆ దంపతులు, తాము ఆ ఫోన్‌ను చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని పట్టుబట్టారు. విషయం తీవ్రతను గుర్తించిన లాయర్, కోల్‌కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్‌ను విక్రయించిన షాపు బౌబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో, ఈ కేసు అక్కడికి బదిలీ అయింది. అక్కడి పోలీసులు షాపు యజమానిని, ఫోన్‌ సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్‌ను ప్రశ్నించడం ప్రారంభించారు.

ప్రారంభంలో షాపు డాక్యుమెంటేషన్‌ను పరిశీలించినప్పుడు ఎలాంటి అక్రమాలు కనిపించలేదు. అందుకే ఇప్పుడు దృష్టి డిస్ట్రిబ్యూటర్‌పైకి మళ్లింది. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దాని యజమాని చరిత్ర, అది గతంలో ట్యాంపర్ చేయబడిందా, తిరిగి ఉపయోగించబడిందా లేదా రీప్యాక్ చేయబడిందా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అయితే ఇది కేవలం ఒకటే సంఘటనా లేక దొంగతనం చేసిన ఫోన్లు లేదా పాత ఫోన్‌లను కొత్తవిగా తిరిగి విక్రయించే పెద్ద కుంభకోణంలో భాగమా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. దీని వెనుక ఒక పెద్ద గ్యాంగ్ ఉందని.. విచారణ ఇంకా ప్రారంభం దశలోనే ఉందని.. ఇలాంటి కుంభకోణం ఉంటే అది కొనుగోలుదారులకు తీవ్రమైన చట్టపరమైన సమస్యలను సృష్టించవచ్చని అన్నారు. కొత్త, సీల్ చేసిన ఫోన్‌లను కొంటున్నామని భావించే వ్యక్తులు ఒక్కసారిగా చట్టపరమైన ఉచ్చులో పడవచ్చని ఆయన హెచ్చరించారు.

ఈ సంఘటన కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగింది. ఆ లాయర్ ఆ ఫోన్‌ను కోల్‌కతాలోని మిషన్ రో ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న ఒక షాపు నుండి కొన్నాడు. ఫోన్ సీల్ చేయబడి, GST ఇన్‌వాయిస్‌తో కొత్తగా కనిపించింది. ఫిబ్రవరిలో వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ ఫోన్‌ను తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. కానీ, ఫోన్ ఆన్ చేసిన వెంటనే గుజరాత్ పోలీసులు వచ్చి, ఆ ఫోన్ సైబర్ క్రైమ్ కేసుతో ముడిపడి ఉందని తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రాల మధ్య దర్యాప్తును ప్రేరేపించింది.

Also Read: బంగారం కొనుగోలు చేస్తే నష్టమే.. ETFలు బెస్ట్.. నిపుణలు ఎందకు చెబుతున్నారంటే

ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి, కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని, ఫోన్‌లు కొనేటప్పుడు ఆథరైజ్‌డ్ స్టోర్ రూమ్ లేదా షాపు నుండి మాత్రమే కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు.

Related News

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

Big Stories

×