BigTV English

Election Results: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న ఎన్డీఏ.. మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

Election Results: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న ఎన్డీఏ.. మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

Lok Sabha Election Results updates(Politics news today India): బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ మార్క్ ను దాటింది. తాజా సమాచారం ప్రకారం.. 296 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 232 స్థానాల్లో ఇండియా కూటమి, ఇతరులు – 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు.


అయితే, 2019లో ఒంటరిగానే 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి మాత్రం తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈసారి యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఊహించని రీతిలో పుంజుకున్నది. ఆ పార్టీకి తాజా సమాచారం ప్రకారం 36 సీట్లు వచ్చాయి. ఇటు బెంగాల్ లో కూడా బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నది.

కాగా, యూపీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019లో దాదాపు చాలా స్థానాలను నిలబెట్టుకున్నది. కానీ, ఈసారి మాత్రం అక్కడ అనూహ్య రీతిలో సమాజ్ వాదీ పార్టీ పుంజుకుని అనూహ్య రీతిలో సత్తా చాటింది. మొత్తం 80 స్థానాలను కలిగి ఉన్న ఆ రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం.. ఎస్పీ 35 స్థానాలు, బీజేపీ 34 స్థానాల్లో, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నాయి.


పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ హోరాహోరీ ఉంటుందని భావించిన బీజేపీ కేవలం 10 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉన్నది. ఇటు తృణమూల్ కాంగ్రెస్ 31 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.

2019 లోక్ సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లలో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి సెంచరీ కొట్టబోతున్నది. తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రాంతీయ పార్టీలు అయినటువంటి సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు చాలా సీట్లను గెలవబోతున్నాయి. ఇటు శివసేన థాకరే, ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీలు పలు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.

Also Read: విపక్షాలపై స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ.. మోదీ రాజీనామాకు మమతా డిమాండ్

అయితే, ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓడిపోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతోపాటు పలువురు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.

Related News

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×