BigTV English

campaign has Ended: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఎప్పుడంటే..?

campaign has Ended: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఎప్పుడంటే..?

Sixth Phase Election campaign has Ended: నేటితో ఆరో దశ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆరో దశలో భాగంగా 58 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 25న పోలింగ్ జరగనున్నది. ఈ 58 స్థానాల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.


ఉత్తర్ ప్రదేశ్ – 14, హర్యానా-10, బీహార్-8, పశ్చిమ బెంగాల్ – 8, ఢిల్లీ – 7, ఒడిశా-6 జార్ఖండ్- 4, జమ్మూ అండ్ కాశ్మీర్ -1 లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనున్నది. భారీ భద్రత నడుమల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 25న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. అయితే, ఆరో దశ ఎన్నికల పోలింగ్ లో ఢిల్లీ, హర్యానా సీట్లు ఉండడం విశేషం. పార్లమెంటు ఆరో దశ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. గెలుపుపై ఇటు ఆప్, అటు బీజేపీ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటు చివరి దశ అయినటువంటి పార్లమెంటు ఏడో దశ పోన్నికల పోలింగ్ వచ్చే నెల 1న జరగనున్నది. ఫలితాలు జూన్ 4న రానున్న విషయం తెలిసిందే.


అయితే, దేశంలో పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 7 దశల్లో పార్లమెంటు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఐదు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరో, ఏడు దశల ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఈ ఏడు దశల్లో ఎన్నికల నిర్వహిస్తున్నది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 543 మంది లోక్ సభ సభ్యులను ఎన్నుకోనున్నారు ప్రజలు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇటు తెలంగాణలో కూడా 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది. వీటి ఫలితాలు జూన్ 4న రానున్న విషయం తెలిసిందే.

Tags

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×