PDP Chief Mehbooba Mufti To Contest From Anantnag faces Ghulam Nabi Azad: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ లోక్సభ ఎన్నికల్లో అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాగా ఈ స్థానం నుంచే మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్తో పోటీ చేయనున్నారు. దీంతో అనంత్నాగ్ ఆసక్తికరంగా మారింది.
శ్రీనగర్ నుంచి వహీద్ పారా, బారాముల్లా నియోజకవర్గం నుంచి ఫయాజ్ మీర్ను పీడీపీ ప్రకటించింది. జమ్మూ ప్రాంతంలోని రెండు స్థానాలైన ఉదంపూర్, జమ్మూలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని పీడీపీ ప్రకటించింది.
కాశ్మీర్ లోయలోని మూడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజులకే.. మూడు స్థానాలకు పీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
కాగా 2004, 2014 ఎన్నికల్లో పీడీపీ చీఫ్ అనంత్నాగ్ నుంచి గెలుపొందారు.
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాం నబీ ఆజాద్పై ముఫ్తీ పోటీ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం కోసం తాను ఎన్నికల్లో పోరాడుతున్నానని మాజీ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.
Also Read: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన నిరుద్యోగం.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
“అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే మనకు రాష్ట్ర హోదా లేకుండా పోయింది. మనది కేంద్రపాలిత ప్రాంతం. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు నేను రాజ్యసభలో పోరాడాను. రాష్ట్ర హోదా కోసం నేను లోక్సభలో కూడా పోరాడాలనుకుంటున్నాను.. గవర్నర్తో కూడిన పూర్తి రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తాం.. లోక్సభలో నా మొదటి పోరాటం రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే” అని ఆయన చెప్పారు.
అనంత్నాగ్-రాజౌరీ స్థానానికి మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.