LPG Cylinder Booking: మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో.. దేశీయ గ్యాస్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల గ్యాస్ సిలిండ్ ధరను రూ.60 పెంచాయి కంపెనీలు. దీంతో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్రం ప్రభుత్వం.. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. గతంలో 55 రోజులకు ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే వ్యక్తులు తాజాగా 15 రోజుల్లో సిలిండర్లను బుక్ చేసుకోవడం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. కమర్షియల్ కనెక్షన్ల కంటే వంట గ్యాస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిది. అలాగే ప్రభుత్వం మరిన్ని ఎల్పీజీ సరఫరా దేశాల కోసం వెతుకుతుంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాల నుంచి ఎల్పీజీని విక్రయించడానికి ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు.
ముడి చమురు ధరలు బ్యారెల్కు 130 డాలర్లకు చేరుకునే వరకు భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో తగినంత నిల్వ ఉన్నందున ఇంధన ధరలు పెరిగే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల వద్ద స్థిరీకరణ చెందుతాయని తెలిపాయి. దేశంలోని ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని పేర్కొన్నాయి.
Also Read: సామాన్యులకు భారీ ఊరట.. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
హార్ముజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా ముడి చమురు రవాణా వేగవంతం చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో తగినంత ఏవియేషన్ టర్బైన్ ఇంధనం నిల్వ ఉందని పేర్కొంది. ఏటీఎఫ్ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.