E-Paper
Advertisement

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?
Madhya Pradesh news today

Madhya Pradesh news today(Current news from India):

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్‌గఢ్‌లోని పిప్లియా రసోడా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు బాలిక బోరుబావిలో పడిందని గుర్తించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. రాజ్ గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్ గఢ్ ఎస్పీ ధరమ్ రాజ్ మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక సుమారు 30 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ, ఇతర పరికరాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వెళ్లగా.. 22 అడుగుల వద్ద చిన్నారి ఏడుపును గుర్తించారు. పాప బ్రతికే ఉందని గ్రహించి.. వెంటనే ఆక్సిజన్ ను లోపలికి పంపారు. సుమారు 9 గంటల పాటు శ్రమించి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బాలికను బయటకు తీశారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×