E-Paper
Advertisement

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?
Advertisement
Madhya Pradesh news today

Madhya Pradesh news today(Current news from India):

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్‌గఢ్‌లోని పిప్లియా రసోడా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు బాలిక బోరుబావిలో పడిందని గుర్తించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. రాజ్ గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్ గఢ్ ఎస్పీ ధరమ్ రాజ్ మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక సుమారు 30 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ, ఇతర పరికరాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వెళ్లగా.. 22 అడుగుల వద్ద చిన్నారి ఏడుపును గుర్తించారు. పాప బ్రతికే ఉందని గ్రహించి.. వెంటనే ఆక్సిజన్ ను లోపలికి పంపారు. సుమారు 9 గంటల పాటు శ్రమించి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బాలికను బయటకు తీశారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×