E-Paper
Advertisement

Haldwani Violence Update: నివురుగప్పిన నిప్పులా హల్ద్వానీ.. హింస ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ..

Haldwani Violence Update: నివురుగప్పిన నిప్పులా హల్ద్వానీ.. హింస ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ..
Advertisement

Madrasa Demolition Haldwani Violence Update: హింసతో అట్టుడికిన ఉత్తరాఖండ్ లో హల్ద్వానీ నివురుగప్పిన నిప్పులా ఉంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉంది. బంభుల్‌పురాలో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోంది. ఫిబ్రవరి 8 సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని మదర్సా, మసీదును కూల్చివేసేందుకు వచ్చిన సామాన్య ప్రజలకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత కర్ఫ్యూ విధించారు. తాజాగా హల్ద్వానీలో కర్ఫ్యూను సవరించారు. హింస ప్రభావం ఉన్న బంభులన్‌పురా ప్రాంతం, ఆర్మీ కాంట్ , బైపాస్‌లలో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో కర్ఫ్యూ లేదు.

కర్ఫ్యూ ఆంక్షలు..
అత్యవసర పని (వైద్యం ) మినహా ఎవరూ ఇల్లు వదిలి వెళ్లకూడదు. అన్ని వ్యాపార సంస్థలు,దుకాణాలు,పరిశ్రమలు పూర్తిగా మూసివేత ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలి. చాలా ముఖ్యమైన పని విషయంలో సిటీ మేజిస్ట్రేట్ హల్ద్వానీ అనుమతితో ట్రాఫిక్ అనుమతి నైనిటాల్ రోడ్, బరేలీ రోడ్, రాంపూర్ రోడ్, కలదుంగి రోడ్, ముఖాని, దహ్రియా, ఉంచాపుల్ ప్రాంతాల్లో పోలీసుల దిగ్బంధనం మధ్య వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

Advertisement

Read More: PV Narasimharao : పీవీ.. మన ఠీవీ.. ఆర్థిక సంస్కరణల పితామహునిగా గుర్తించిన చరిత్ర

“హల్ద్వానీలో పరిస్థితి సాధారణంగా ఉంది. కర్ఫ్యూ ఎత్తివేశాం. బంబుల్‌పురాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశాం. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.” అని రాష్ట్ర ADG లా అండ్ ఆర్డర్ AP అన్షుమాన్ తెలిపారు.

Advertisement

హల్ద్వానీలోని బంభుల్‌పురాలో శాంతిభద్రతల పరిరక్షణకు మేజిస్ట్రేట్‌ను నియమించారు. మొత్తం ప్రాంతాన్ని 5 సూపర్ జోన్‌లుగా విభజించారు. 7 మంది మేజిస్ట్రేట్‌లను మోహరించారు.

బంబుల్‌పురా హింస కేసులో పెట్రోల్ బాంబులు తయారు చేసిన 12 మంది యువకుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. వారు పెట్రోల్‌ బాంబులు తయారు చేసి దుండగులకు ఇస్తున్నట్లు హల్ద్వానీ పోలీసులకు సమాచారం అందింది. బైక్‌లోని పెట్రోల్‌ను తీసి దుండగులు పెట్రోల్‌ బాంబులు తయారు చేసినట్లు సమాచారం. బంబుల్‌పురా పోలీస్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన బైక్‌లో పెట్రోల్ పైపులను కోసి వాహనాలకు నిప్పు పెట్టారు.

Tags

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×