E-Paper
Advertisement

మహారాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. స్కూల్ క్యాంటీన్లు, పరిసరాల్లో జంక్ ఫుడ్ బ్యాన్!

మహారాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. స్కూల్ క్యాంటీన్లు, పరిసరాల్లో జంక్ ఫుడ్ బ్యాన్!
Advertisement

Junk Food Ban: మన పిల్లల భవిష్యత్తు, వారి ఆరోగ్యమే మన నిజమైన సంపద. కానీ నేడు ఎక్కడ చూసినా జంక్ ఫుడ్ రాజ్యమేలుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ ప్రమాదకరమైన అలవాట్లకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల లోపల, చుట్టు పక్కల జంక్ ఫుడ్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధిస్తూ ఎఫ్‌డీఏ (FDA) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన ఈ చారిత్రాత్మక నిర్ణయం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎఫ్‌డీఏ నిషేధిత ఆహార పదార్థాల విషయానికి వస్తే.. స్కూల్ క్యాంటీన్లు, విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమైన హై-ఫాట్, సాల్ట్, షుగర్ ఉన్న పదార్థాలపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఇందులో ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లు, క్యాండీలు, చక్కెర శాతం ఎక్కువగా ఉండే స్వీట్లతో పాటు నూనెలో వేయించిన చిప్స్, నమ్‌కీన్లు, ఇతర జంక్ ఫుడ్ ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేసింది. అలాగే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, సోడాలు, ఆర్టిఫిషియల్ డ్రింక్స్‌తో పాటు ఎనర్జీ డ్రింక్స్, కెఫిన్ ఉండే డ్రింక్స్, హెవీ ఐస్‌క్రీమ్‌లను కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. ఈ నిబంధన కేవలం స్కూల్ క్యాంటీన్లకే పరిమితం కాకుండా.. పాఠశాల క్యాంపస్‌కు 50 మీటర్ల చుట్టు కొలత పరిధిలో ఉన్న దుకాణాలు, క్యాంటీన్లకు కూడా వర్తిస్తుంది. అంటే.. స్కూల్ గేట్ వెలుపల పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ అమ్మడాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం నిషేధించడం జరిగింది.

Advertisement

ఈ నిబంధనలను అమలు చేయడమే కాకుండా.. పాఠశాలలకు ప్రభుత్వం కొన్ని కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. పిల్లలకు పోషకాహారాన్ని అలవాటు చేయడానికి స్కూల్ యాజమాన్యాలు క్యాంటీన్లలో పండ్లు, తాజా కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని సూచించారు.

ఇదిలా ఉంటే.. ఈ నిషేధం విజయవంతంగా కొనసాగాలంటే ప్రతి పాఠశాలలోనూ ఈ నియమాలు కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు ఒక ‘ఫుడ్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్’ను తప్పనిసరిగా నియమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. పిల్లలు, తల్లిదండ్రులలో మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు స్కూల్ ప్రాంగణంలో హెల్తీ ఈటింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఏ పాఠశాలైనా లేదా చుట్టుపక్కల దుకాణాలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, FSSAI మార్గదర్శకాల ప్రకారం వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement

పిల్లలే దేశ భవిష్యత్తు కాబట్టి వారి శరీరం దృఢంగా ఉంటేనే రేపటి సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. డబ్బులకు ఆశపడి జంక్ ఫుడ్‌ను అమ్మే వ్యాపారులకు చెక్ పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఈ అద్భుతమైన రూల్‌ను అమలు చేసి, మన చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటున్నారు.

Related News

యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

తరుణ్ తేజ్‌పాల్‌ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

పెళ్లైన వారం రోజులకే.. విడాకులు మంజూరు, గుట్టు విప్పిన వధువు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!

రెండు దశాబ్దాల బంధానికి ముగింపు.. ప్రియుడితో భార్య పెళ్లి చేసిన భర్త, యూపీలో ఆ ప్రేమకుడు ఎవరు?

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

Big Stories

Advertisement
×