E-Paper
Advertisement

Maharastra Poling Day: నేడు మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్.. వివ‌రాలు ఇవే

Maharastra Poling Day: నేడు మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్.. వివ‌రాలు ఇవే

మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ స‌హా మ‌రో మూడు రాష్ట్రాల్లోని ప‌దిహేను అసెంబ్లీ స్థానాల‌కు పోలీంగ్ ప్ర‌క్రియ ఉద‌యం ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంట‌ల‌కు ముగియ‌నుంది. మహారాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. మొత్తం 4,136 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. మ‌హారాష్ట్ర‌లో అజిత్ ప‌వార్ ఎన్సీపీ వ‌ర్గం 59 మంది అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపింది. మ‌హావికాస్ అఘాడీలో కాంగ్రెస్ 101 మందిని బరిలో నిలిపింది.

బీజేపీ నుండి 149 మంది బ‌రిలో ఉన్నారు. శివ‌సేన యూబీటీ నుండి 95 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. శ‌ర‌ద్ ప‌వార్ ఎన్సీపీ నుండి 86 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. మ‌రోవైపు ఎంఐఎం కూడా ఈ ఎన్నిక‌ల్లో 17 మంది అభ్య‌ర్థుల‌ను పోటీలో దింపింది. ఈ నెల 23న ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. సీట్ల స‌ర్దుబాటులో కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుద‌రలేదు. దీంతో ఆ స్థానాల్లో కూట‌మి పార్టీలు స్నేహ‌పూర్వ‌క పోటీలో దిగుతున్నాయి. ఇక ఝార్ఖండ్ లో రెండో విడ‌త‌లో 38 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాల‌కు సైతం నేడు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×