BigTV English

BJP Manifesto : అక్కడి ప్రజలపై బీజేపీ వరాల జల్లు.. ఇన్ని హామిలు ఇవ్వడం ఇదే తొలిసారి

BJP Manifesto : అక్కడి ప్రజలపై బీజేపీ వరాల జల్లు.. ఇన్ని హామిలు ఇవ్వడం ఇదే తొలిసారి

BJP Manifesto : దిల్లీ అసెంబ్లీలో ఎలాగైనా గెలుపు బావుటా ఎగురవేయాలని గట్టుదట్టి పలతో ఉన్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ మ్యానిఫెస్టోలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే.. ఆమ్ ఆద్మీ పార్టీ తన మ్యానిఫెస్టోను ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ కూడా ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలకు అందులో చోటు కల్పించింది. దిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే గర్భణీ స్త్రీలకు రూ.21 వేల ఆర్థిక సాయం చేస్తామని, గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీతో పాటు, మహిళలకు నెలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. బీజేపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఇతర హామీలు..


దిల్లీలోని ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో ‘సంకల్ప పత్రా’ పార్ట్‌-1 పేరుతో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ హామీలతో పాటు ప్రస్తుతం దిల్లీలో అమల్లో ఉన్న అన్ని పథకాల్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఇందులో..

  •  దిల్లీలోని గర్భిణీ స్త్రీలకు రూ.21 వేల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ ప్రకటించింది. పిల్లలు బలవర్థకంగా ఉండేందుకు… ఆరు పౌష్టికాహార కిట్లు అందజేయనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ. 5వేలు, రెండో సంతానానికి రూ.6 వేలకు ఇవి అదనంగా ఇవ్వనున్నారు.
  • పేద కుటుంబీలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్‌ ఇవ్వనున్నారు. ప్రతి హోలీ, దీపావళి పర్వదినాల్లో ఒక్కోక గ్యాస్ సిలిండర్ చొప్పున ఉచితంగా అందించనున్నారు. అలాగే.. 60-70ఏళ్ల వయో వృద్ధులకు రూ.2,500 పెన్షన్‌ అందించనుండగా, 70 ఏళ్లు నిండిన వారికి రూ.3000 వేలు అందించి చేయుతగా నిలవనున్నట్లు బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
  • దిల్లీలోని ‘ఝగ్గి-ఝోప్డీ’ (జేజే) క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన బీజేపీ.. అక్కడి పేదలకు రూ.5 కే పోషకాహారం అందజేస్తామని తెలిపింది.  జేజే క్లస్టర్లు అంటే అనధికారిక సెటిల్‌మెంట్లు/మురికివాడలు.
  • ‘మహిళా సమృద్ధి యోజన’ కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం. దిల్లీలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీ అందిస్తామని ప్రకటించారు.

అవినీతిపై తొలి పోరు.. 


పార్టీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శనాస్త్రాలు సంధించారు. దిల్లీలో వచ్చే ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నడ్డా.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించించారు. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లో చేరకపోవడం వల్ల దిల్లీలోని 51 లక్షల మంది ప్రజలు వైద్య ప్రయోజనాల్ని కోల్పోయారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాడిన తొలి మంత్రి వర్గ సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని నడ్డా వెల్లడించారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మొహల్లా క్లీనిక్ లు అవినీతికి నిలయాలుగా మారాయని.. అక్కడ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.  దాదాపు రూ.300 కోట్ల ప్రజల సొమ్మును ఈ క్లీనిక్ లను అడ్డుపెట్టుకుని దోచుకున్నారంటూ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే.. ఆప్ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.

Also Read : రోడ్డు నాణ్యత బాగోలేదా అయితే వాళ్లంతా జైలుకే.. కేంద్రం కొత్త రూల్

దిల్లీలో మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఇస్తామని ఆప్ ప్రభుత్వం హామీ ఇస్తుందని.. అలాంటప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఎందుకు ఆర్థిక సాయం చేయడం లేదని ప్రశ్నించారు. కనీసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై రాయితీని కూడా అందించడం లేదని మండిపడ్డారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×