BigTV English

Man Returns from Germany to Cast vote: ‘నేను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశా’

Man Returns from Germany to Cast vote: ‘నేను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశా’

Man Returns from Germany to Cast vote: ఓటు హక్కు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అధికారులు కూడా చాలెంజింగ్ తీసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచుతున్నారు. కొంతమంది ఉన్నతాధికారులైతే బస్టాండ్లు, దుకాణాల వద్దకు వెళ్లి మరీ వారితో మాట్లాడి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తెలిపిన విషయం కూడా తెలిసిందే. అంతేకాదు.. ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడెందుకు ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చిందేంటే.. శుక్రవారం జరిగిన పార్లమెంటు రెండో విడత ఎన్నికల్లో ఓ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం తెలిసి అతడిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.


ఇందుకు సబంధించి వివరాల్లోకి వెళితే.. దేశంలో శుక్రవారం పార్లమెంటు ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగింది. 13 రాష్ట్రాల్లోని 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, ఉత్తర ప్రదేశ్ లోని గౌతమబుద్ధ నగర్ లో కూడా ఆ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కానీ, ఒక ఓటరు మాత్రం అందరి దృష్టిని ఆకర్శించాడు. ఎందుకంటే అతను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశాడు. అభిషేక్ ఆర్య అనే ఇతను ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లి గత ఏడేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం నోయిడాకు వచ్చాడు. అనంతరం అతను తన సోదరీమణులతో కలిసి నోయిడాలోని సెక్టార్ 31 లోని సరస్వతి బాలికా విద్యా మందిర్ లోని పోలింగ్ బూత్ కు చేరుకున్నాడు. అనంతరం అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏడేళ్లుగా జర్మనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అయితే తాను కేవలం ఓటు వేయాలన్న ఉద్దేశంతోనే జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశానని తెలిపాడు. అదేవిధంగా ఇలా జర్మనీ నుంచి వచ్చి ఓటు వేయడం ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.


Also Read: రానున్న రోజుల్లో ప్రధాని మోదీ కన్నీరు పెట్టినా పెట్టొచ్చు: రాహుల్ గాంధీ

ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు.. అతడిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. జర్మనీ నుంచి వచ్చి ఓటు వేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచావంటూ మెచ్చుకుంటున్నారు. అయితే, శుక్రవారం దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×