E-Paper
Advertisement

Manish sisodia: మనీష్ సిసోడియా టీ తాగుతూ.. 17 నెలల తర్వాత అంటూ..

Manish sisodia: మనీష్ సిసోడియా టీ తాగుతూ.. 17 నెలల తర్వాత అంటూ..

Manish sisodia latest tweet(Telugu news updates): ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులు బయటపడుతున్నారా? మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ వెనుక ఏం జరిగింది? ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏంటి? 17 నెలల తర్వాత ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్ అని ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు ఆ స్కామ్‌లో ఉన్న నిందితులను వెంటాడుతోంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో దాదాపు 17 నెలలపాటు తీహార్ జైలులో ఉన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు.

శనివారం ఉదయం నిద్ర లేవగానే వైఫ్‌తో కలిసి టీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసుకున్నారాయన. 17 నెలల తర్వాత ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్ అంటూ రాసుకొచ్చారు. భారతీయ పౌరులకు రాజ్యాంగం నుంచి జీవించే హక్కు వచ్చిందే ఈ స్వేచ్ఛ అని ట్వీట్ చేశారు.

ALSO READ: ఆ ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే భారత్ కు మహర్ధశే..

రాజకీయ నాయకుడి మాటలకు అర్థాలు వేరులే అన్నట్లు మనీష్ సిసోడియా ట్వీట్‌కు చాలామంది అర్థాలు వెతుకుతున్నారు. శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయిన వెంటనే, నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. సిసోడియాను చూడగానే కేజ్రీవాల్ వైఫ్ సునీత కంటతడి పెట్టారు. అలాగే కేజ్రీవాల్ పేరెంట్స్ ఆశీర్వాదాలు తీసుకున్నారు సిసోడియా. జైలుకు వెళ్లిన నుంచి ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారాయన.

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×