BigTV English

Pakistan Earthquake: వణికిస్తున్న ప్రకృతి.. పాక్‌లో భారీ భూకంపం

Pakistan Earthquake: వణికిస్తున్న ప్రకృతి.. పాక్‌లో భారీ భూకంపం

Pakistan Earthquake: పాక్‌కు వరుస షాక్‌లు.. దెబ్బ మీద దెబ్బ.. ప్రకృతి కూడా సహకరించని పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా చూసిన కూడా పాకిస్థాన్‌లో శాంతి నెలకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అయితే భారత్‌లో యుద్ధం ఉద్రిక్తతను ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ అతలాకుతలం అవుతుంది. ఇక ప్రకృతి కూడా తాండవించడంతో.. ప్రకృతి కూడా పాకిస్థాన్ పై పగబట్టినట్టుగా ప్రళయాన్ని సృష్టించడంతో.. పాక్ ప్రజలు ఆందోళనకు గురవుచున్నారు.


శనివారం తెల్లవారు జామున పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రజలు అయితే తీవ్ర భయాందోళనకు గురి చెందుతున్నట్లు తెలుస్తుంది. అయితే నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ NSC ప్రకారం ఈ భూకంపం శనివారం తెల్లవారు జామున 1.44 గంటల సమయంలో సంభవించినట్లు తెలుస్తుంది. అయితే భూకంప కేంద్రంగా టర్కీ ప్రాంతం గుర్తించింది. దీని ప్రభావం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలపైన కూడా కనిపిస్తుంది. ఈ రిక్టార్ స్కెల్ పైనా దీని ప్రభావం 4.0 గా నమోదయినట్లు ఇప్పటికే (NCS) ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్‌లోని, ఖైబర్ పఖ్తున్ఖ్వా పంజాబ్, బెలూచిస్తాన్ ప్రాంతంలో అయితే స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తుంది. వీటి కారణంగానే నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చెంది ఇంటి నుంచి బయటకు పరుగులు తీసారు. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం జరగలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.

Also  Read: రాజౌరీలో పాకిస్తాన్‌ కాల్పులు.. భారత్ కీలక అధికారి మృతి


ఇదిలా ఉండగా.. ఇటీవల భారత్‌ లక్ష్యంగా పాకిస్తాన్‌ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆ దేశంపై సైతం ప్రకృతి పగబట్టిందని పలువురు నెటిజన్స్‌ పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దాంతో భాతర్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 6-7 మధ్య భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి 24 మిస్సైల్స్‌తో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్‌ మే 8 నుంచి భారత్‌లోని 15 నగరాలపై దాడికి ప్రయత్నించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి యత్నించగా.. వాటిన్నింటిని భారత రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×