E-Paper
Advertisement

Modi Indonesia Tour : ముగిసిన మోదీ ఇండొనేషియా టూర్..

Modi Indonesia Tour : ముగిసిన మోదీ ఇండొనేషియా టూర్..
Advertisement

Modi Indonesia Tour : ఇండోనేషియాలో జీ20 దేశాల సదస్సు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. యూకే ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బెన్సీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలనీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై యూకే , ఆస్ట్రేలియా ప్రధానిలతో మోదీ చర్చించారు. భారత్ తో ఇతర దేశాల సంబంధాలు మరింత మెరుగుపడాలని మోదీ కోరారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా వివిధ రంగాలకు చెందిన అంశాలపై దేశాధినేతలు చర్చించారు. వాణిజ్యం, శక్తి, రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

Advertisement

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మోదీ విశిష్టమైన కానుక ఇచ్చారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ‘పటాన్ పటోలా దుపట్టా’ను ఆమెకు బహూకరించారు. భారత్ నేతన్నల పనితనానికి మచ్చుతునకలా నిలిచే ఈ స్కార్ఫ్ అందుకున్న మెలోనీ మురిసిపోయారు.

జీ20 సదస్సు కోసం వెళ్లిన ప్రధాని మోదీ టూర్ ముగిసింది. తెల్లవారుజామున ప్రధాని భారత్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అధికారులు ఘనస్వాగతం పలికారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×