E-Paper
Advertisement

Modi Indonesia Tour : ముగిసిన మోదీ ఇండొనేషియా టూర్..

Modi Indonesia Tour : ముగిసిన మోదీ ఇండొనేషియా టూర్..

Modi Indonesia Tour : ఇండోనేషియాలో జీ20 దేశాల సదస్సు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. యూకే ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బెన్సీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలనీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై యూకే , ఆస్ట్రేలియా ప్రధానిలతో మోదీ చర్చించారు. భారత్ తో ఇతర దేశాల సంబంధాలు మరింత మెరుగుపడాలని మోదీ కోరారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా వివిధ రంగాలకు చెందిన అంశాలపై దేశాధినేతలు చర్చించారు. వాణిజ్యం, శక్తి, రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మోదీ విశిష్టమైన కానుక ఇచ్చారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ‘పటాన్ పటోలా దుపట్టా’ను ఆమెకు బహూకరించారు. భారత్ నేతన్నల పనితనానికి మచ్చుతునకలా నిలిచే ఈ స్కార్ఫ్ అందుకున్న మెలోనీ మురిసిపోయారు.

జీ20 సదస్సు కోసం వెళ్లిన ప్రధాని మోదీ టూర్ ముగిసింది. తెల్లవారుజామున ప్రధాని భారత్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అధికారులు ఘనస్వాగతం పలికారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×