E-Paper
Advertisement

Nipah Virus: మళ్లీ వణికిస్తున్న నిఫా వైరస్.. కేరళలో 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్

Nipah Virus: మళ్లీ వణికిస్తున్న నిఫా వైరస్.. కేరళలో 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్

Nipah infection confirmed in Kerala: నిఫా వైరస్ మళ్లీ వణికిస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకింది. తాజాగా, ఆ బాలుడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళకరంగా ఉందని, ఒకవేళ పరిస్థితి విషమిస్తే కోజికోడ్ మెడికల్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల నిమిత్తం బాలుడి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఈ వైద్య పరీక్షల్లో సదరు బాలుడికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జీ ప్రకటించారు. అనంతరం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ప్రస్తుతం బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యమంత్రి తెలిపారు. అయితే బాలుడితో పరిచయం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైతే అతని దగ్గరగా సన్నిహితంగా ఉన్నారో వారి వ్యక్తుల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. ఇప్పటికే హై రిస్క్ కాంటాక్టులను విభజించి నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దీంతోపాటు మలప్పురంలోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు వైరస్ వ్యాప్తిని కట్డి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అయితే ఈ వైరస్ సోకితే మరణించే అవకాశాలు 40 నుంచి 75 శాతం వరకు ఉండటం, దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×