E-Paper
Advertisement

NITI Aayog Report: నీతి అయోగ్ రిపోర్ట్.. భారత్ లో తగ్గుతున్న పేదరికం.

NITI Aayog Report: నీతి అయోగ్ రిపోర్ట్.. భారత్ లో తగ్గుతున్న పేదరికం.

Household Consumption Expenditure Survey

Household Consumption Expenditure Survey: పేదరికం మన దేశంలో 5 శాతం తగ్గిందని నీతి అయోగ్ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం ఆగష్టు 2022 నుంచి జులై 2023 మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేను ఆధారంగా తీసుకుని దీన్ని వెల్లడించినట్లు నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన సర్వే ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల రెండిటిలోను సర్వే ఆధారం తీసుకొని 2.5 శాతం పెరుగుదల కనిపించింది. పట్టణ ప్రాంతాలలో సగటు నెలవారి వినియోగ తలసరి వ్యయం 2011- 12 నుంచి 3.5 శాతం మేర పెరిగి 3,510 కి చేరుకుంది.

అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం 40.42 % పెరుగుదలలో రూ. 200,8 చేరింది. ఈ సర్వే ఆధారంగా తీసుకొని భారతదేశంలో పేదరికం 5 శాతం లేదా అంతకంటే తక్కువ పేదరికం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ సర్వే ఆహారం పై పెడుతున్న ఖర్చు విధానాల మార్పులను కూడా గుర్తించింది.
ఆహార వ్యయం పరంగా గ్రామీణ ప్రాంతాలు 50 % కంటే తక్కువ ఆహారం వినియోగించినట్లు సర్వే తేలింది. అలాగే పట్టణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 2004-05 లో 91 శాతం నుంచి 2022-23 నాటికి 71 శాతం తగ్గిందని సర్వే తెలిపింది.

ఈ సర్వే ప్రకారం ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తుంది శీతల పానీయాలు, పాలు, గుడ్లు, పండ్ల వినియోగం పెరుగుతుందని వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందని సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన హైలట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు విజయవంత మవ్వడం దీన్ని బట్టి చెప్పవచ్చు. అలాగే ఈ సర్వే ప్రకారం ఒక రకంగా పేదరికం అదృశ్యమవుతాయని చెబుతోంది. ఇది నిజంగా శుభ పరిణామం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థిలనుండి తట్టుకొని మరీ ఇలా చక్కటి పురోగతి దిశగా అడుగులు వేయడం మంచి విశషం.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×