E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్‌కు భారీ ఊరట.. ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ

Congress: కాంగ్రెస్‌కు భారీ ఊరట.. ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ
Advertisement

CongressCongress: కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ముందు పన్ను నోటీసులపై కాంగ్రెస్ పై ఎటువంటి చర్యలకు పాల్పడమని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణను కూడా జులై కు వాయిదా వేయమని ఐటీ శాఖ కోర్టును కోరింది.

ఐటీ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు రూ.3,500 కోట్లకు పన్ను డిమాండ్ నోటిసులకు సంబంధించి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి బలవంతపు చర్యలకు పాల్పడమని సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ నోటిసులపై కాంగ్రెస్ పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని జులై 24వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

పన్ను డిమాండ్ల నోటీసులకు గాను కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీపై బలవంతపు చర్యలకు దిగబోం అని కోర్టులో తుషార్ మెహతా తెలిపారు. అయితే ఈ కేసులో తమకు ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు జారీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని కాంగ్రెస్ తరఫు నేత వివేక్ తంఖా ఆరోపించారు.

Also Read: Gyanvapi Mosque: జ్ఞానవాపీ ప్రాంగణంలో హిందూ పూజలు.. కొనసాగింపునకు సుప్రీం అనుమతి..

Advertisement

2017-2018 నుంచి 2020-2021 అసెస్ మెంట్ సంవత్సరాలకు పెనాల్టీ, వడ్డీతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపింది. దీంతో పాటుగా ఆదివారం రూ.1,744 కోట్లు కట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరో నోటీసును పంపింది.

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×