BigTV English
Advertisement

Online Bride Kill Groom: 45 ఏళ్లైనా పెళ్లికాలేదు.. స్వామీజీకి కష్టం చెప్పుకున్నాడు.. ఇంతలోనే శవమై

Online Bride Kill Groom: 45 ఏళ్లైనా పెళ్లికాలేదు.. స్వామీజీకి కష్టం చెప్పుకున్నాడు.. ఇంతలోనే శవమై

Online Bride Kill Groom| వయసు మీరుతున్నా పెళ్లి కావడం లేదని బాధపడే పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య మన దేశంలో రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే ఇదే అదునుగా తీసుకొని మోసగాళ్లు వారిని దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఒక ఘటనలో ఒక అమాయక పెళ్లికొడుకుని అతని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న ఒక యువతి అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. ఆమె గురించి విచారణ చేయగా.. ఆమె ఒక నకిలీ పెళ్లికూతురని తెలిసింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారతదేశంలో అనిరుద్ధాచార్య మహారాజ్ అనే ఒక స్వామిజీ బాగా ఫేమస్. ఆయన తరుచూ తన భక్తుల కోసం ప్రజా దర్బార్ లు నిర్వహిస్తుంటారు. ఆ సభలో వచ్చే భక్తులు తమ వ్యక్తిజీవితంలో ఎదురయ్యే కష్టాలు చెప్పుకుంటూ వాటికి సమాధానం చెప్పాలని స్వామిజీని కోరుతుంటారు. అలా కొన్ని రోజుల క్రితం మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఇంద్రకుమార్ తివారి అనే 45 వ్యక్తి స్వామిజీ దర్బార్ లో వెళ్లి అందరి ముందు తన కష్టాలను చెప్పాకున్నాడు. తనకు 45 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాలేదని.. తనకు 18 ఎకరాల భూమి ఉందని.. తాను మాత్రం ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. తన ఇల్లు, వ్యవసాయ భూమి చూసుకునేవారు.. ఎవరూ లేరని చెప్పాడు. తన సమస్యకు పరిష్కారం సూచించాలని కోరాడు.

అయితే ఆ సమయంలో స్వామిజీ ఇంద్రకుమార్ సమస్యకు సరదాగా సమాధానం చెప్పారు. అతని ఆస్తులు ప్రజా సంక్షేమం కోసం దానం చేసి.. సన్యాసం తీసుకొని సాధువుగా జీవించాలని చెప్పారు. అయితే వారిద్దరి మాటలన్నీ వీడియోగా రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అనిరుద్ధ స్వామిజీ వీడియోలకు బాగానే వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఇంద్ర కుమార్ తివారీ వీడియో చూసిన ఒక గ్యాంగ్ అతడిని టార్గెట్ చేసింది.


సోషల్ మీడియా ద్వారా ఇంద్ర కుమార్ కు ఖషీ తివారీ(27) అనే ఒక యువతి సంప్రదించింది. తన కంటే చాలా తక్కువ వయసు గల ఒక యువతి పైగా అందగత్తె కావడంతో ఇంద్ర కుమార్ ఎంతో సంతోషపడ్డాడు. రెండు రోజులు చాటింగ్ చేశాక.. అతనితో ఖుషీ తివారీ పెళ్లికి అంగీకరించింది. అయితే తాను ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లో నివసిస్తున్నానని.. తనను పెళ్లి చేసుకోవాలంటే గోరఖ్ పూర్ రావాలని ఇంద్ర కుమార్ తో చెప్పింది. పెళ్లికోసం ఆగలేక పోయినా ఇంద్ర కుమార్.. ఆమెను వివాహం చేసుకోవడానికి బంగారు నగలు, నగదు తీసుకొని వెళ్లాడు. అలా వెళ్లిన ఇంద్ర కుమార్ మళ్లీ తిరిగిరాలేదు.

Also Read: ఉద్యోగంలో చేరకుండానే లక్షల్లో నష్టపరిహారం.. ఉద్యోగి హక్కులని చెప్పిన కోర్టు

ఇంద్ర కుమార్ కనిపించడం లేదని పోలీసులకు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీనగర్ లోని ఒక ఊరి చివర దట్టంగా ఉన్న అడవిలాంటి ప్రాంతంలో ఇంద్ర కుమార్ మృతదేహం లభించింది. అతని మెడలో ఒక కత్తి గుచ్చేసి ఉంది. పోలీసులు ఇంద్రకుమార్ హత్య కేసు విచారణ చేయగా.. అతని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఖుషీ తివారీ గురించి తెలుసుకున్నారు. ఆమె అసలు పేరు సాహిబా బానో అని తెలిసింది. నకిలీ ఆధార్ కార్డ్ లో ఖుషీ తివారీగా పేరు మార్చుకొని ఆమె ఇంద్ర కుమార్ తివారీని ఆమె పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఇంద్ర కుమార్ ని హత్య చేసి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసలు వారి కోసం గాలిస్తున్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×