BigTV English

Vikram Misri Warning: పాకీ బుద్ధి మానని పాక్‌.. మళ్లీ కాల్పులు! మిస్రి గట్టి క్లాస్!

Vikram Misri Warning: పాకీ బుద్ధి మానని పాక్‌.. మళ్లీ కాల్పులు! మిస్రి గట్టి క్లాస్!

Vikram Misri Warning: పాకిస్తాన్ బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ఆ పాకీ బుద్ధి మానదు. మాటలు శాంతి, చేతలు చూస్తే వంకర బుద్ధి. దేహీ అంటూ ఇంటికి వస్తే, కూర్చోబెట్టి మరీ శత్రువునైనా సత్కరించడం మనకు అలవాటు. ఈరోజు వరకు మన దెబ్బకు గజగజ వణికిన పాకీ పాక్, శాంతి చర్చలు అంటూ సందేశం పంపిన విషయం తెలిసిందే. అయితే స్వతహాగా పాక్ అంటేనే పాకీ పనుల్లో ఆరితేరింది కాబట్టి మన సైన్యం కూడా కాల్పుల విరమణ ప్రకటించినా అప్రమత్తంగా ఉంది. కేంద్రం కూడా పాక్ పై ఓ కన్ను వేసి ఉంచింది. కానీ చివరకు పాక్ మాత్రం పాకీ పని మొదలు పెట్టింది. దీనితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి గట్టిగానే పాక్ కు ఇచ్చి పడేశారు.


అసలేం జరిగిందంటే..
భారతదేశం – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, శనివారం సాయంత్రం రెండు దేశాల DGMOల మధ్య అవగాహన కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి (Vikram Misri) వెల్లడించారు. ఈ చర్చల వల్ల సరిహద్దుల్లో కాల్పులు ఆపేందుకు దారి తీయబోతుందనుకునే లోపే, పాకిస్తాన్ ఉల్లంఘనకు దిగిందని ఆయన చెప్పారు.

గత కొన్ని గంటలుగా, ఈ అవగాహనను పాకిస్తాన్ (Pakistan) ఉల్లంఘిస్తోందన్నారు. భారత సైన్యం (Indian Army) ఈ సరిహద్దు చొరబాటును ఎదుర్కుంటోందని, దానికి తగిన ప్రతీకారం కూడా తీసుకుంటోందని విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు. ఈ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. చొరబాటుకు పూర్తి బాధ్యత పాకిస్తాన్‌దే అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్ తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకొని చర్యలు తీసుకోవాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఇది యుద్ధానికి ఎదురుపడుతున్న దేశానికి మాత్రమే కాదు, శాంతికి అవకాశం ఇవ్వాలనుకునే దేశాలకు కూడా పరీక్ష సమయంమని మిస్రి వ్యాఖ్యానించారు.


ఇక భారత సైన్యం అన్నింటికీ సన్నద్ధంగా ఉందని, దేశ రక్షణలో ఎలాంటి నిగ్రహం ఉండదని స్పష్టం చేశారు. DGMO స్థాయిలో వచ్చిన ఒప్పందాన్ని పాకిస్తాన్ తుంచేయడం వల్లే ఈ ఉద్రిక్తతలు మళ్లీ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. విదేశాంగ శాఖ ధీటుగా స్పందించడంతో, దేశవ్యాప్తంగా మిస్రి వ్యాఖ్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. కాగా కాశ్మీర్ వద్ద మళ్లీ కాల్పులు వినిపిస్తున్నాయని ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Pak Drone Attack: మళ్లీ భారత్‌పై పాక్ అటాక్..? ఎంతవరకు నిజం?

మిస్రీ ఇచ్చిన వార్నింగ్ తో పాక్ పాకీ పని మానుకుంటుందా? లేదా మళ్లీ మన సైన్యం చేతిలో చావు దెబ్బలు తింటుందా అన్నది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా ప్రధాని మోడీ సారథ్యంలో మన దేశ సైనికులు దేనికైనా రెడీ అనే రీతిలో సిద్ధమయ్యారు. దటీజ్ భారత్ (India) .. ఇంటికి వచ్చిన శత్రువును గౌరవించే సంప్రదాయం మనది.. ఇంట్లో వారికే విషం పెట్టే వంకర బుద్ధి పాకిస్తాన్ ది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Big Stories

×