BigTV English
Advertisement

India Vs Pakistan War : ఇంకా కశ్మీర్ కోసమే కక్కుర్తా? పాక్ బుద్ది మారదా?

India Vs Pakistan War : ఇంకా కశ్మీర్ కోసమే కక్కుర్తా? పాక్ బుద్ది మారదా?

India Vs Pakistan War : కశ్మీర్.. కశ్మీర్.. కశ్మీర్. దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్ కోసమే పాకిస్తాన్ కక్కుర్తి పడుతోంది. ఆ హిమాలయా రాష్ట్రం భారత్‌లో విలీనం అవడాన్ని తట్టుకోలేక పోతోంది. పీవోకేను అక్రమంగా ఆక్రమించుకున్నాక కూడా సంతృప్తి పడట్లేదు. ఉగ్రవాదులతో మారణహోమం సృష్టిస్తూ.. రావణకాష్టాన్ని రాగిలిస్తూనే ఉంది. కార్గిల్ వార్ తరహా ఘటనలతో చేతులు కాల్చుకున్నాక కూడా బుద్ది మారట్లేదు. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడితో మరోసారి కశ్మీర్‌ను డిస్ట్రర్బ్ చేయాలని చూసింది. ఈసారి చేతులే కాదు.. పాక్ ఒళ్లంతా తగలబెట్టేసింది ఇండియా. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది ఇంటికెళ్లి మరీ చంపేసి వచ్చింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌లోని 9 నగరాల్లో అగ్గి పెట్టింది. పాక్‌లో లంకా దహనం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్లీ కశ్మీర్‌పైనే కన్నుపడింది పాపిస్తాన్‌కు.


కశ్మీరే టార్గెట్

జమ్మూ కశ్మీర్‌ను పాక్‌లో విలీనం చేయడమే ఉగ్రసంస్థల ప్రధాన లక్ష్యం. దీని కోసమే అటు పాక్, ఇటు ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌కు రివేంజ్‌గా గురువారం రాత్రి భారత్‌లోని 15 నగరాలపై దాడులకు ప్రయత్నించింది పాక్. ఈ దాడిలోనూ కశ్మీర్‌నే ఎక్కువ టార్గెట్ చేసింది. డ్రోన్లు, మిస్సైల్స్‌లో ఎక్కువ భాగం జమ్మూపైనే ఎక్కుపెట్టింది. ఇండియన్ ఆర్మీ దీటుగా ఎదుర్కొంది కాబట్టి సరిపోయింది. లేదంటే, ఈపాటికి కశ్మీర్ పరిస్థితి ఎలా ఉండేదో.


తమకు దక్కలేదనే కోపమా?

జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ పై పాక్ అటాక్ చేసింది. జమ్మూ ఎయిర్‌పోర్టుపై దాడులకు ట్రై చేసింది. సరిహద్దు వెంబడి పాక్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఇన్నేళ్లూ ఏ కశ్మీర్ కావాలని అంతటి మారణహోమానికి పాల్పడిందో.. ఇప్పుడు అదే ప్రాంతాన్ని బాంబులతో బుగ్గి చేయాలని చూసింది పాక్. తమకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే కాన్సెప్ట్ కావొచ్చు. గురువారం రాత్రి పాక్ దాడి సక్సెస్ అయి ఉంటే ఏం జరిగేది? కశ్మీర్ ప్రజలు కాలి బూడిదయ్యేవారు. జమ్మూ, శ్రీనగర్ శవాల దిబ్బగా మారేది. కానీ, మన ఆర్మీ ముందు పాక్ ఆటలు సాగలేదు.

కశ్మీర్ ప్రజలు మారేనా?

గురువారం రాత్రి కొన్ని గంటల పాటు యుద్ధ బీభత్సం కొనసాగింది. శుక్రవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా తెల్లవారింది. అక్కడి పౌరులకు పాక్ దాడి చేస్తుందేమోననే భయం ఇప్పుడు తొలగిపోయింది. ఇండియన్ ఆర్మీ తమకు అడ్డుగోడల నిలబడి కాపాడుతుందనే ధైర్యం నెలకొంది. ఇది కదా కావాల్సింది. మరి, తమను చంపాలని చూసిన పాకిస్తాన్‌పై కశ్మీర్ ప్రజల్లో కోపం, ధ్వేషం పెరుగుతుందా? ఇన్నాళ్లూ భారత్‌ వ్యతిరేక భావజాలంతో ఉన్న కొన్ని వర్గాలు ఇప్పటికైనా కళ్లు తెరుస్తాయా? పాక్‌కు కావలసింది అక్కడి ప్రజలు కాదని.. కేవలం ఆ భూభాగం మాత్రమేననే లాజిక్ ఇప్పటికైనా గ్రహిస్తారా? పాక్ కసాయిలా తమను చంపాలని చూస్తే.. ఇండియా కన్న తల్లిలా తన బిడ్డలను కాపాడుకున్న తీరు అక్కడివారి కళ్లు తెరిపిస్తుందా? ఇప్పటికైనా పాక్ మత్తును వదులుతారా?

నివురు గప్పిన నిప్పులా..

ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్తా ప్రశాంతగానే కనిపిస్తోంది. భద్రతా బలగాలు భారీగా మోహరించారు. అప్రమత్తత కొనసాగుతోంది. ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కలికంగా సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికులు అపోహలకు లోను కావొద్దని సైన్యం ప్రకటించింది. ఎలాంటి సమాచారమైన ఆర్మీ నుంచి వస్తేనే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.

ఉగ్ర చొరబాట్లకు చెక్

మరోవైపు, సరిహద్దుల్లో పాక్ కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్ర మూకల్ని కశ్మీర్‌లోకి పంపించేందుకు అనువుగా బోర్డర్‌లో కాల్పులకు తెగబడుతోంది. గురువారం రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టర్‌లోని ధన్‌ధర్‌ పోస్ట్‌ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపేందుకు ప్లాన్ చేసింది. పాక్ కుట్రను పసిగట్టిన BSF.. సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన.. ఏడుగురు జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది.

Also Read : యుద్ధంపై సోషల్ మీడియాలో ఓవరాక్షన్ వద్దు.. లేదంటే లోపలేసుడే..

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×