Kanpur: కాన్పూర్లో శిక్షణ విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గంగా నది ఒడ్డునున్న నాతా పూర్వ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరొక పైలట్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక విమానం ప్రమాదం చోటు చేసుకుంది. గంగా బ్యారేజ్ సమీపంలో శిక్షణా విమానం ఒకటి కూలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన విమానానికి రెండు ఇంజన్లు ఉన్నాయి. గాలిలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు.
అందులో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విమానం కూలిన శబ్దం విన్న సమీపంలోని గ్రామస్థులు తమ ఇళ్ల నుండి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రెండో పైలట్ను విమానం శిథిలాల నుండి బయటకు తీశారు. వెంటనే వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల విమానాల ప్రమాదాల్లో ట్రైనీ విమానాలు కూలిపోతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. శిక్షణా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
#WATCH | UP | A twin-engine four-seater training aircraft crashes in a field in Kanpur; Instructor pilot and trainee pilot killed, say police.
(ANI) pic.twitter.com/PFUA7w9sTH
— Argus News (@ArgusNews_in) August 27, 2026