Stuart Broad On Pak Fans: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవగా… నేటి నుంచి రెండో టెస్టు లండన్ వేదికగా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరువు తీస్తూ మరోసారి స్టువర్ట్ బ్రాడ్ హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఎంత గింజుకున్నా…3-0 తేడాతో ఇంగ్లాండ్ వైట్ వాష్ చేయడం గ్యారంటీ అని సవాల్ విసిరారు. తలకిందులుగా తపస్సు చేసిన.. ఇంగ్లాండ్ గడ్డపై బాబర్ ఆజం సేన ఒక్క మ్యాచ్ కూడా గెలవబోదని కుండ బద్దలు కొట్టి చెప్పారు స్టువర్ట్ బ్రాడ్.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ప్రారంభం నుంచి స్టువర్ట్ బ్రాడ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సిరీస్ ప్రారంభం కాకముందే మూడింటిలో పాకిస్తాన్ ఓడిపోయి… ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ కావడం గ్యారెంటీ అని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే మొదటి మ్యాచ్ లో చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోయింది. ఇక రెండో టెస్ట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరోసారి స్టువర్టు బ్రాడ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ వైట్ వాష్ అవుతుందని తాను కామెంట్ చేసిన నేపథ్యంలో… ఆ దేశ అభిమానులు తనను టార్గెట్ చేసి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాళ్లతో కొట్టి చంపుతామని బెదిరిస్తున్నట్లు వివరించారు.
తనను చంపేసే కుట్రకు కూడా పాకిస్తాన్ అభిమానులు తెగించారని ఆగ్రహించారు స్టువర్ట్ బ్రాడ్. అయితే తనను చంపేస్తే పాకిస్తాన్ గెలవడం అసాధ్యమని వాళ్లకు తెలియదంటూ పరువు తీశారు. తనపై దృష్టి పెట్టడం కంటే… మ్యాచ్పై ఫోకస్ చేయాలని కౌంటర్ ఇచ్చారు. అప్పుడే పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఉంటాయని వివరించారు. కానీ ఇది చేతకాని దద్దమ్మలు… తనను టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పటికీ చెబుతున్నా, నన్ను రాళ్లతో కొట్టి చంపిన కూడా ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ గెలవబోదని తేల్చి చెప్పారు. ఇక తర్వాత మీ కర్మ అంటూ వదిలేశారు. ఇంగ్లాండ్ తో పోలిస్తే పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉందని వెల్లడించారు. తన క్రికెట్ చరిత్రలో ఇంత వీక్ టీం ఏదీ లేదని హేళన చేశారు. అందుకే వైట్ వాష్ తప్పదని తెలిపారు స్టువర్ట్ బ్రాడ్. ఇది ఇలా ఉండగా, ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ లండన్ వేదికగా ప్రారంభం కానుంది.