PM KUSUM Scheme: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం ఒకటి. దీని కింద 60 శాతం సబ్సిడీతో రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 25 ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. రైతులు తమ బంజరు భూములు లేదా సాగుకు పనికిరాని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ గా 60 శాతం సబ్సిడీని అందిస్తాయి. మిగిలిన మొత్తంలో 30 శాతం బ్యాంకుల నుంచి రుణంగా పొందవచ్చు. రైతుల 10 శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ నుంచి రోజుకు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ను డిస్కమ్ లు కొనుగోలు చేస్తాయి. ఒక యూనిట్కు రూ. 3.13 చొప్పున ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. అంటే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
పీఎం కుసుమ్ స్కీమ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Step1: పీఎం కుసుమ్ అధికారిక పోర్టల్కి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step2: స్క్రీన్పై కనిపించే రిజిస్ట్రేషన్ ఫామ్ లో అవసరమైన అన్ని వివరాలను నింపండి.
Step3: డిక్లరేషన్ బాక్స్ను టిక్ చేసి, “సబ్మిట్”పై క్లిక్ చేయండి.
Step4: రిజిస్ట్రేషన్ తర్వాత సోలార్ అగ్రికల్చరల్ పంప్సెట్ సబ్సిడీ స్కీమ్ కోసం “లాగిన్”పై క్లిక్ చేయండి.
Step5: ఆన్లైన్ అప్లికేషన్ లో సమాచారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.
Also Read: ఇదెక్కడి ఘోరం.. లక్షకు 74 లక్షల వడ్డీ, అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్మిన అన్నదాత