E-Paper
Advertisement

PM KUSUM Scheme: 25 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ వివరాలివే

PM KUSUM Scheme: 25 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం..  కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ వివరాలివే

PM KUSUM Scheme: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం ఒకటి. దీని కింద 60 శాతం సబ్సిడీతో రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 25 ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. రైతులు తమ బంజరు భూములు లేదా సాగుకు పనికిరాని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ గా 60 శాతం సబ్సిడీని అందిస్తాయి. మిగిలిన మొత్తంలో 30 శాతం బ్యాంకుల నుంచి రుణంగా పొందవచ్చు. రైతుల 10 శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ నుంచి రోజుకు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ను డిస్కమ్ లు కొనుగోలు చేస్తాయి. ఒక యూనిట్‌కు రూ. 3.13 చొప్పున ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. అంటే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.

పీఎం కుసుమ్ స్కీమ్ అర్హులు ఎవరంటే?

  • రైతు లేదా రైతుల గ్రూప్ లేదా రైతు సంఘాలు
  • సహకార సంఘాలు
  • నీటి వినియోగదారుల సంఘాలు
  • గ్రామ పంచాయతీ

ఎలా అప్లై చేసుకోవాలి?

పీఎం కుసుమ్ స్కీమ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Step1: పీఎం కుసుమ్ అధికారిక పోర్టల్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step2: స్క్రీన్‌పై కనిపించే రిజిస్ట్రేషన్ ఫామ్‌ లో అవసరమైన అన్ని వివరాలను నింపండి.

Step3: డిక్లరేషన్ బాక్స్‌ను టిక్ చేసి, “సబ్మిట్”పై క్లిక్ చేయండి.

Step4: రిజిస్ట్రేషన్ తర్వాత సోలార్ అగ్రికల్చరల్ పంప్‌సెట్ సబ్సిడీ స్కీమ్ కోసం “లాగిన్”పై క్లిక్ చేయండి.

Step5: ఆన్‌లైన్ అప్లికేషన్ లో సమాచారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

Also Read: ఇదెక్కడి ఘోరం.. లక్షకు 74 లక్షల వడ్డీ, అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్మిన అన్నదాత

అవసరమయ్యే పత్రాలివే

  • ఆధార్ కార్డ్
  • ల్యాండ్ డాక్యుమెంట్
  • బ్యాంక్ పాస్‌బుక్
  • డిక్లరేషన్ ఫామ్
  • మొబైల్ నంబర్
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×