BigTV English

PM Modi in Gujarat: వాలినాథ్ ధామ్ ఆలయం ప్రారంభోత్సం.. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలు

PM Modi in Gujarat: వాలినాథ్ ధామ్ ఆలయం ప్రారంభోత్సం.. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలు

PM Modi Gujarat Tour Updates: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నరు. వాలినాథ్ ధామ్ ఆలయాన్ని ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పలు పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలను ప్రారంభించారు.


డెయిరీ రంగానికి మహిళలు వెన్నెముక అని మోదీ అన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రతి మహిళ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలన్నారు. ముద్రా యోజన కింద 70 శాతం మంది మహిళలకు రూ. 30 లక్షల కోట్లకుపైగా సహాయం అందించామని గుర్తు చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంలో కేంద్ర ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతను చూపిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 60,000 పైగా అమృత్ సరోవర్ల నిర్మాణాన్ని ప్రస్తావించారు. రైతులను ఆదుకోవడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలను వివరించారు. ఈ కార్యక్రమం రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా రూపొందించామని ప్రధాని మోదీ అన్నారు.


Read More: ఢిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి.. ఆప్‌ కి నాలుగు.. కాంగ్రెస్‌కి మూడు..

అమూల్‌కు మోదీ ప్రశంసలు తెలిపారు. భారత స్వతంత్రం తర్వాత దేశంలో అనేక బ్రాండ్లు ఆవిర్భవించాయని పేర్కొన్నారు. అయితే విశ్వాసం, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, రైతు సాధికారత ఆత్మనిర్భర్ భారత్ కోసం స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన అమూల్ లాంటి బ్రాండ్ మరొకటి లేదని స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం సంవత్సరానికి 6 శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు. సంవత్సరానికి 2 శాతం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పాడి పరిశ్రమను అధిగమించిందన్నారు.

Tags

Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×