E-Paper
Advertisement

Underwater Metro Section: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

Underwater Metro Section: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో..  ప్రారంభించిన ప్రధాని మోదీ..
Advertisement

pm modi inaugurates underwater metroUnderwater Metro Section to be Inaugurated by PM Modi(Telugu news live): దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగున పరిగెత్తే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అధునాత అండర్‌ వాటర్‌ మెట్రో రైల్ సర్వీస్‌‌ను కోల్‌కతాలో ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. కోల్‌కతా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు 120 కోట్లతో దీనిని నిర్మించారు. ఈ సొరంగ రైలు మార్గం హుగ్లీ నది కింద ఉంది.

కోల్‌కతా ఈస్ట్-వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూ భాగంలో ఉంటుంది. ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ ఉంది. ఇందులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. ఈ టన్నెల్‌ను మెట్రో రైలు 45 సెకన్లలో దాటేస్తుంది. ఈ కారిడార్‌ పరిధిలో ఎస్‌ప్లెనెడ్‌, మహాకారణ్‌, హౌరా, హౌరా మైదాన్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.

Advertisement

లండన్‌-ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీస్ మాదిరిగా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించారు. ఈ వినూత్న ప్రాజెక్టుతో రైలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రావడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తుంది.

Read More: డీకే శివకుమార్‌‌కు ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు..

Advertisement

కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో ప్రయాణికులు భయాందోళనలకు గురవకుండా.. పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందుజాగ్రత చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×