E-Paper
Advertisement

Kashi Vishwanath Temple: వివాదంలో యోగి సర్కార్.. అర్చకుల వేషధారణలో పోలీసులు

Kashi Vishwanath Temple: వివాదంలో యోగి సర్కార్.. అర్చకుల వేషధారణలో పోలీసులు
Advertisement

UP Police in Priests Attire(Latest today news in India): యూపీలోని యోగి సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు కొత్తరకం యూనిఫాం ధరించారు. వారి సాధారణ యూనిఫాం కాకుండా అర్చకులు వేషధారణలో వస్త్రాలు ధరించి విధులు నిర్వహించారు. దీంతో సమాజ్ వాద్ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఖండించారు.

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు ధోతి కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు. అయితే దీన్ని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు వారి యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడానికి అనుమతి ఇవ్వడం.. భద్రతకు పెను ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు.

Advertisement

పోలీసులు పూజారులు వేషం వేయడం ఏ పోలీస్ మాన్యువల్ ప్రకారం సరైనదని ప్రశ్నించారు. మోసగాళ్లు దీన్ని ఆశరాగా తీసుకుని అమాయకపు ప్రజలను మోసం చేస్తే ఏం చేస్తారని పలు అనుమానాలను లేవనెత్తారు. యూపీ ప్రభుత్వం, పాలనా యంత్రాంగం దీనిపై ఏం సమాధానం చెబుతుందని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆదేశాలు ఇచ్చే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, యూపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారణాసి పోలీస్ కమిషన్ మెహిత్ అగర్వాల్ సమర్థించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఆలయాల్లో విధును నిర్వర్తించే పోలీసుల విధులు వేరుగా ఉంటాయని తెలిపారు.

Advertisement

Also Read: జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ

ఆలయాల్లో భారీగా భక్తులు ఉంటారని.. వారిని పోలీసులు నెడితే మరోలా భావిస్తారని, అదే పూజారులు చేస్తే సానుకూలంగా స్వీకరిస్తారని అన్నారు. భక్తుల కోసం మాత్రమే పోలీసులు అర్చకుల వేషధారణలో మోహరించినట్లు వెల్లడించారు.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×