E-Paper
Advertisement

President Droupadi Murmu: రామలల్లా సన్నిధిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు.. 150 కిలోల శ్రీరామ యంత్రం ప్రతిష్టాపన!

President Droupadi Murmu: రామలల్లా సన్నిధిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు.. 150 కిలోల శ్రీరామ యంత్రం ప్రతిష్టాపన!

President Droupadi Murmu: అయోధ్యలోని రామమందిరాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుమారు 150 కిలోల బరువున్న బంగారు పూత పూసిన శ్రీరామ యంత్రం అనే లోహ పలకను ఆమె ప్రతిష్టించారు. చైత్ర నవరాత్రులు.. హిందూ నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువుల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాతా అమృతానందమయి వంటి ప్రముఖుల సమక్షంలో ఈ యంత్రాన్ని రాష్ట్రపతి ప్రతిష్టాపన చేశారు. అనంతరం బాల రాముడికి (రామలల్లా) హారతి ఇచ్చి.. దేశ ప్రజల సుఖశాంతులు.. శ్రేయస్సు కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ విశిష్టమైన లోహ పలకను దాదాపు రెండేళ్ల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వైభవంగా ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువచ్చారు. అప్పటి నుండి దీనికి ఆలయంలో ప్రతిరోజూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. చైత్ర నవరాత్రుల శుభవేళలో అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో ఈ యంత్రాన్ని రామమందిరం రెండో అంతస్తులో శాశ్వతంగా ప్రతిష్టించనున్నారు. శ్రీరాముడి దివ్య సన్నిధికి చిహ్నంగా.. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపేలా ఈ యంత్రం నిలుస్తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ఈ శ్రీరామ యంత్రం విశిష్టతను వివరిస్తూ.. ఇది వేద గణితం ఆధారంగా రూపొందించబడిందని తెలిపారు. సానుకూల ఆధ్యాత్మిక శక్తిని ఉత్పత్తి చేసేలా రూపొందించిన ఈ 150 కిలోల చతురస్రాకార లోహ పలకపై వేద మంత్రాలు.. బీజాక్షరాలను పొందుపరిచారు. కంచి కామకోటి పీఠంలోని శ్రీరామ యంత్రం నమూనా ఆధారంగా స్వామి విజయేంద్ర సరస్వతి మార్గనిర్దేశంలో దీనిని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ పర్యవేక్షణలో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని ఆలయ సముదాయం.. నగరం అంతటా మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను ఉంచి నిఘాను కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు భక్తులు.. స్థానికులు అధికారులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ స్థాయిలో పాల్గొన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఇదే కావడం విశేషం.

Read Also: Tirumala: తిరుమలలో మొదటి మెట్టు ఎందుకు ప్రత్యేకమో తెలుసా

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×