MS Dhoni On Impact Player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. దాదాపు 84 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా ( Impact Player) తాను ఆడబోనని చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) ఓనర్ కు కుండబద్దలు కొట్టి చెప్పాడట మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni). తాను గ్రౌండ్ లోకి దిగితే, మ్యాచ్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఆడతానని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మనీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి కొత్తగా సంజు శాంసన్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి సంజు శాంసన్ వికెట్ కీపర్ గా పని చేస్తాడని అంటున్నారు. అంటే మహేంద్ర సింగ్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పై మహేంద్రసింగ్ ధోని అసహనం వ్యక్తం చేసినట్లు కూడా పోస్ట్ వైరల్ గా మారింది. తాను ఇంపాక్ట్ ప్లేయర్ గా అసలు ఆడబోనని కుండ బద్దలు కొట్టి చెప్పాడట మహేంద్రసింగ్ ధోని.
తాను ఆడితే 20 ఓవర్లు కచ్చితంగా గ్రౌండ్ లో వర్క్ చేస్తానని తెలిపాడు. బ్యాటింగ్ చేయను కావచ్చు కానీ వికెట్ కీపింగ్ మాత్రం మ్యాచ్ పూర్తి అయ్యేవరకు చేస్తానని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి వివరించాడు. మ్యాచ్ పూర్తయ్యే వరకు వికెట్ కీపింగ్ చేసే సత్తా తనలో ఉంది.. అలాంటప్పుడు తాను ఇంపాక్ట్ క్లియర్ గా అసలు వెళ్లబోనని కుండబద్దలు కొట్టి, చెప్పడని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, మహేంద్ర సింగ్ ధోనీకి మధ్య గొడవలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపితే ఆయన రిటైర్మెంట్ ఇచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ లాగానే రోహిత్ శర్మకు కూడా ఇదే సమస్య తలెత్తే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. ఈసారి కూడా అతన్ని అలాగే పంపిస్తారని చర్చ జరుగుతోంది. మరి దీనిపై ముంబై ఇండియన్స్ అటు చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి.
🚨 MASSIVE STATEMWNT BY MS DHONI IN IPL IMPACT PLAYER RULES 🚨
Ms Dhoni Said 🗣️
When it was first launched, I too said the same thing, IPL is already in a very good position. There is no need to add any extra excitement to it. The games are already quite high-scoring, the… pic.twitter.com/lgNOQrPIG2
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 19, 2026