E-Paper
Advertisement

Prime Minister Narendra Modi: పోలాండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ..45 ఏళ్ల తర్వాత తొలిసారి!

Prime Minister Narendra Modi: పోలాండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ..45 ఏళ్ల తర్వాత తొలిసారి!
Advertisement

PM Modi departs for Poland and Ukraine(Political news telugu): ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పోలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ప్రధాని రెండు రోజులపాటు పర్యటించనున్నారు. పోలాండ్ దేశంతో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పయనమయ్యారు. అక్కడ ధ్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో చర్చలు జరపనున్నారు.

పోలాండ్ దేశంలో భారత ప్రధాని 45 ఏళ్ల తర్వాత పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1979లో ఆనాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ ను సందర్శించారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపంతం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉక్రెయిన్ దేశానికి పయనం కానున్నారు. ఈ దేశంలో ఒక్కరోజు పర్యటించనున్నారు.

Advertisement

మధ్య ఐరోపాలో భారత్‌కు పోలాండ్ కీలక ఆర్థకి భాగస్వామిగా ఉంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడితో పాటు ప్రధాని డొనాల్డ్ టస్క్ తో భేటీ కానున్నట్లు చెప్పారు. అనంతరం ఆ దేశంలో ఉన్న భారతీయులతో ముచ్చటించనున్నట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండు దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

ఉక్రెయిన్ దేశంలో భారత ప్రధాని చేపట్టనున్న తొలి పర్యటన కావడం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధాన అంశంగా చర్చించనున్నామన్నారు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి తెర పడేలా జెలెన్ స్కీ తో భేటీ కానున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

Also Read: జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో పర్యటించనున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ..

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ పర్యటలో భాగంగా బుధ, గురువారాల్లో పోలాండ్ దేశంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి శుక్రవారం ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించి కీవ్ చేరుకుంటారు. అక్కడ జెలెన్ స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ అదే రైలు మార్గంలో పోలాండ్ చేరుకోనున్నారు. ఈ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి రానున్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×