E-Paper
Advertisement

Rahul Gandhi: మ‌హా రైతుల‌తో రాహుల్ వీడియో కాల్.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని హామీ!

Rahul Gandhi: మ‌హా రైతుల‌తో రాహుల్ వీడియో కాల్.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని హామీ!

మహారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. అన్ని వ‌ర్గాల వారికి ఉప‌యోగ‌ప‌డేలా ప‌థ‌కాలు ర‌చిస్తూ ముందుకు వెళుతోంది. ఆ పార్టీ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ సైతం మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ మ‌హారాష్ట్ర రైతుల‌తో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ బాధ‌ల‌ను రాహుల్ గాంధీకి చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీంతో రాహుల్ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ప‌లు హామీలు అమ‌లు చేస్తామ‌ని వారికి చెప్పారు. వ‌చ్చే డ‌బ్బుల‌తో త‌మ బిడ్డ‌ల‌ను ఏం చ‌దివిస్తామో.. ఏం తిండి పెడ‌తామో అర్థం కావ‌డం లేద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో మ‌హారాష్ట్ర రైతుల కోసం మ‌హావికాస్ అఘాడీ కూటమి చారిత్రాత్మ‌క అడుగులు వేస్తామ‌ని హామీ ఇచ్చారు.

సోయాబీన్ కు క్వింటాలుకు రూ.7000 ఎంఎస్ ప్ల‌స్ బోన‌స్ ఇస్తామ‌ని చెప్పారు. ఉల్లికి కూడా స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించేందుకు క‌మిటీ వేస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా ప‌త్తికి కూడా మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చి ఆ రైతుల‌ను సైతం ఆదుకుంటామ‌ని చెప్పారు. గ‌త మూడు ఎన్నిక‌ల‌లో సోయాబీన్ కు రూ.6వేల రూపాయలు ఎంఎస్పీ ఇస్తామ‌ని బీజేపీ వాగ్దానం చేసింద‌ని చెప్పారు. కానీ నేటికీ రైతులు త‌మ ర‌క్తం, చెమ‌ట‌తో పండించిన సోయాబీన్ కు రూ.3వేల నుండి రూ.4వేల రూపాయ‌ల‌కు అమ్ముతున్నార‌ని చెప్పారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి దిగే

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×