BigTV English
Advertisement

RahulGandhi: శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ.. నేతలతో భేటీ.. రాత్రి ఫేమస్ రెస్టారెంట్‌లో..

RahulGandhi: శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ.. నేతలతో భేటీ.. రాత్రి ఫేమస్ రెస్టారెంట్‌లో..

RahulGandhi: జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు నేతలతో సమావేశాలు, మరోవైపు ప్రజలతో మమేకం అవుతున్నారు. గతరాత్రి ఫేమస్ రెస్టారెంట్‌కు వచ్చిన ఆయన ఇష్టమైన వంటకాలను రుచి చూశారు.


జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అక్కడ అడుగుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో అహ్దూస్ ఫేమస్ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ తన సహచరులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ఆ తర్వాత లాల్ చౌక్‌లో ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో మమేకం అయ్యారు అగ్రనేత రాహుల్‌గాంధీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఏమైనా మార్పు వచ్చిందా అని వారిని అడిగారు. జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో రాజకీయ నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నరని చెప్పుకొచ్చారు.


ALSO READ:  ప్రముఖ హీరో కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరణ

శ్రీనగర్‌లో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే. గురువారం ఉదయం జమ్మూకాశ్మీర్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలను దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మీటింగ్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి తదుపరి అడుగులు వేయనున్నారు.

మరోవైపు జ‌మ్మూకాశ్మీర్ కాంగ్రెస్ – నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ మ‌ధ్య పొత్తు కుదిరే అవ‌కాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనుసరించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఎన్సీ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాలతో రాహుల్, ఖర్గే సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×