Rajiv Pratap Rudy: ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లే విమానంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సాధారణంగా ఎంపీలు విమానాల్లో ప్రయాణికులుగా వెళ్లడం చూస్తుంటా. కానీ, ఒక సీనియర్ ఎంపీ ఏకంగా కాక్పిట్లో కూర్చోని విమానాన్ని నడిపితే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి సయ్యద్ షాహనవాజ్ హుస్సేన్కు సరిగ్గా అలాంటి అరుదైన అనుభవమే ఎదురైంది.
కాక్పిట్లో ఎంపీ.. ప్రయాణికుల్లో ఆశ్చర్యం!
షాహనవాజ్ హుస్సేన్ ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణిస్తున్న సమయంలో, ఆ విమానానికి కమాండర్ గా ఉన్నది ఎవరో కాదు.. ఆయన సహచర బీజేపీ ఎంపీ, సీనియర్ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ రాజీవ్ ప్రతాప్ రూడీ! విమానం ల్యాండ్ అయిన తర్వాత తన మిత్రుడిని కాక్పిట్లో చూసిన షాహనవాజ్ హుస్సేన్ ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషపడ్డారు. వెంటనే ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అద్భుతమైన ల్యాండింగ్.. బహుముఖ ప్రజ్ఞాశాలి
రాజీవ్ ప్రతాప్ రూడీ విమానాన్ని నడిపిన తీరు, ముఖ్యంగా ల్యాండింగ్ చేసిన విధానం చాలా సున్నితంగా, అద్భుతంగా ఉందని షాహనవాజ్ హుస్సేన్ కొనియాడారు. ‘ప్రపంచంలోనే పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, కమర్షియల్ విమానాలను నడపగల ఏకైక ఎంపీ బహుశా రాజీవ్ ప్రతాప్ రూడీ ఒక్కరే కావచ్చు’ అని పేర్కొన్నారు. రూడీ కేవలం ఒక రాజకీయనాయకుడే కాదు.. ఆయనొక న్యాయవాది, ప్రొఫెసర్, నైపుణ్యం కలిగిన పైలట్. అన్నింటికీ మించి మంచి మనసున్న మానవతావాది, ఆత్మీయ మిత్రుడు అని ప్రశంసించారు.
బీహార్ గర్వించదగ్గ నాయకుడు
తన మిత్రుడితో కలిసి ప్రయాణించడం ఎంతో ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇచ్చిందని షాహనవాజ్ హుస్సేన్ అన్నారు. రాజీవ్ ప్రతాప్ రూడీ ఇలాగే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ, తన సేవలతో బీహార్ రాష్ట్రానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని, దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Also Read: కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!