E-Paper
Advertisement

Ratan Tata Land Rover: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!

Ratan Tata Land Rover: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!
Advertisement

Ratan Tata Land Rover| టాటా గ్రూప్ మాజీ చైర్మెన్, దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బుధవారం కన్నుమూశారు. భారతదేశంలో వ్యాపార రంగం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆటోమొబైల్స్, సాఫ్ట్‌వేర్, ఎఫ్‌ఎంసిజి ఇలా అన్ని రంగాల్లో టాటా కంపెనీ సాధించిన విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

టాటా కంపెనీ చైర్మెన్ రతన్ టాటా పెదనాన్న జెఆర్‌డి టాటా 50 సంవత్సరాలకు పైగా ఆ పదవిలో ఉన్నారు. రతన్ టాటా యోగ్యతను గుర్తించి జెఆర్‌డి టాటా ఆ పదవిని రతన్ టాటాకు కట్టబెట్టారు. ఆ బాధ్యతను స్వీకరించిన రతన్ టాటా రెండు దశాబ్దాలకు శ్రమించి టాటా గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. తమ కంపెనీతో పాటు భారతదేశానికి మంచి పేరు సంపాదించారు. ఏకంగా బ్రిటీష్ దిగ్గజ కంపెనీలైన కోరస్ స్టీల్, లగ్జరీ కార్ బ్రాండ్లు జాగుఆర్ ల్యాండ్ రోవర్ ని కొనుగోలు చేశారు.

Advertisement

అయితే ఇంత సాధించిన రతన్ టాటాకు ఒక సమయంలో ఒక అమెరికన్ కారు కంపెనీ ఓనర్ ఘోరంగా అవమానించాడు. భారతీయులకు కారు తయారీ గురించి ఏమీ తెలియదని అపహాస్యం చేశాడు. కానీ అదే అమెరికన్ కాలక్రమంలో రతన్ టాటా వద్దకు కాళ్ల బేరానికి వచ్చాడు.

Also Read: బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

Advertisement

1991 టాటా గ్రూప్ చైర్మెన్ పదవి చేపట్టిన రతన్ టాటా తమ కార్ల కంపెనీ నష్టాల్లో ఉండడం చూసి దాన్ని అమెరికన్ కంపెనీ ఫార్డ్ కు విక్రయించాలని ప్రయత్రించారు. అందుకోసం 1999లో అమెరికా వెళ్లారు. అక్కడ ఫార్డ్ కంపెనీ చైర్మెన్ బిల్ ఫార్డ్ తో సమావేశమయ్యారు. అయితే ఆ మీటింగ్ లో బిల్ ఫార్డ్ ను బిల్ ఫార్డ్ ఘోరంగా అవమానించాడు. ”మీ ఇండియన్స్ కు కార్లు తయారు చేయడం గురించి ఏం తెలుసు. అసలు ప్యాసింజర్ కార్లు తయారు చేయడం ఎందుకు ప్రారంభించావు? నీ కంపెనీ నేను కొనుగోలు చేయడమంటే మీపై నేను ఉపకారం చేయడమే అవుతుంది. అంతే..” అని బిల్ ఫార్డ్.. రతన్ టాటాతో చెప్పాడు. బిల్ ఫార్డ్ అన్న మాటలు రతన్ టాటా గుండెల్లో బాణాలుగా గుచ్చుకున్నాయి.

ఇదంతా విన్న తరువాత రతన్ టాటాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. తన కార్ల కంపెనీ విక్రయించకూడదని రతన్ టాటా నిర్ణయించుకున్నారు. వెంటనే ఇండియా తిరిగి వచ్చి 9 ఏళ్లలో కార్ల బిజినెస్ విజయవంతంగా నడిపారు. అయితే కాల చక్రం తిరిగింది. ఈ సారి బిల్ ఫార్డ్ కష్టాల్లో పడ్డాడు. బ్రిటీష్ లిల్యాండ్ అనే కంపెనీని బిల్ ఫార్డ్ 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి తప్పు చేశాడు. ఆ కార్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. దీంతో బిల్ ఫార్డ్ తన కార్ల కంపెనీని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.

Also Read: పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరమైన రతన్ టాటా.. బాల్యం ఎలా గడిచిందంటే..

అటుఇటు తిరిగి బిల్ ఫార్డ్ 2008లో రతన్ టాటా వద్దకు వచ్చాడు. జాగుఆర్, ల్యాండ్ రోవర్ లగ్జరీ కారు బ్రాండ్ లను తాను విక్రయించాలనుకుంటున్నానని రతన్ టాటాతో చెప్పాడు. నష్టాల్లో ఉన్నా రతన్ టాటా ఆ లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఈ డీల్ కు ఒప్పుకోవడంతో బిల్ ఫార్డ్ అతనికి చేతులెత్తి మొక్కాడు. ”మీరు మా కార్ బ్రాండ్ కొనుగోలు చేసి నాపై ఉపకారం చేశారు.” అని రతన్ టాటాతో చెప్పాడు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×