E-Paper
Advertisement

Ratan Tata Passed Away: విలువలు తెలిసిన గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సంతాపం

Ratan Tata Passed Away: విలువలు తెలిసిన గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సంతాపం
Advertisement

ప్రముఖ వాణిజ్య దిగ్గజం.. రతన్ టాటా (Ratan Tata) బుధవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం యావత్ భారతావనిని ఉలిక్కిపాటుకు గురిచేసింది. వాణిజ్యంలో ఎన్నో విలువలు పాటిస్తూ.. నమ్మకానికి మారుపేరుగా గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టాటా కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ (X) వేదికగా రతన్ టాటాకు నివాళులు అర్పించారు.

రతన్ టాటా.. అసాధారణ వ్యక్తి: మోదీ

Advertisement

రతన్ టాటా మరణవార్త వినగానే ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘‘రతన్ టాటా.. దూరదృష్టి గల వ్యాపారవేత్త. అసాధారణమైన వ్యక్తి. ఆయన ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఆయన ఎంతో వినయం, దయతో మెలిగేవారు. సమాజాన్ని మెరుగుపరచాలనే నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆయన్ని ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు’’ అని మోదీ అన్నారు.

‘‘పెద్ద కలలు కనడం.. తాను సంపాదించింది సమాజానికి తిరిగి ఇవ్వడం. ఇవే రతన్ టాటాలోని ప్రత్యేక అంశాలు. అది ఆయన అభిరుచి కూడా. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ వంటి సామాజిక సేవలను అందించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. రతన్ టాటాతో జరిపిన ఎన్నో చర్చలు మనసులో నిండిపోయాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ఆయనను తరచుగా కలిసేవాడిని. విభిన్న సమస్యలపై మేమిద్దరం అభిప్రాయాలను పంచుకొనేవాళ్లం. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయనతో చర్చలు నడిచాయి. రతన్ టాటా మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఆయన కుటుంబికులు, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.

Advertisement

Also Read: వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరు.. దేశం దిగ్భ్రాంతి

రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ సైతం రతన్ మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి. వ్యాపారం, సామాజిక సేవ.. రెండింటిలోనూ ఆయన శాశ్వతమైన ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని పేర్కొన్నారు.

రతన్ టాటా వయస్సు ప్రస్తుతం 86 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సాధారణ చెక్ అప్స్ కోసమే హాస్పిటల్‌కు వచ్చానని సోమవారం వెల్లడించారు. అయితే, మంగళవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన్ను ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స అందించారు. అర్థరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. టాటా గ్రూప్ సంస్థ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×