E-Paper
Advertisement

Rohini Khadse Woman Murder: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య

Rohini Khadse Woman Murder: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య
Advertisement

Rohini Khadse Woman Murder Immunity | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథ్‌రావు ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ అనూహ్యమైన అభ్యర్థన చేశారు. మహిళలపై పెరుగుతున్న నేరాలను అణచివేయడానికి, మహిళలు ఒక హత్య చేసినా వారికి ఎటువంటి శిక్ష విధించకూడదని కోరారు. అలాంటి వారికి రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాసిన లేఖలో దీనికి గల కారణాలను వివరించారు.

‘‘ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి వ్యక్తులు నడిచిన దేశం మనది. శాంతికి, అహింసకు నిలయం. అలాంటి దేశంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళలపై హింసా ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే మానవమృగాల్లో ఉన్న ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనావిధానాన్ని అంతమొందించేందుకు మాకు అనుమతినివ్వండి’’ అని లేఖలో కోరారు.

Advertisement

Also Read: కాంగ్రెస్‌లో ఉంటూ బిజేపీ కోసం పనిచేస్తున్నారు.. పార్టీ నాయకులపై రాహుల్ ఫైర్

మహిళలకు మన దేశంలో సరైన రక్షణ లేదని ఇటీవల విడుదలైన ఓ జాతీయ సర్వే ద్వారా తెలిసింది. ఆసియాలోనే మన దేశం అసురక్షిత దేశంగా పేర్కొంది. మహిళల కిడ్నాపింగ్‌లు, మహిళల అదృశ్యం కేసులు, గృహ హింస వంటి తీవ్రమైన ఘోరాలు మహిళలపై జరుగుతున్నాయి. కాబట్టి మేం చేసే ఒక్క తప్పును క్షమించాలని మహిళ తరఫున కోరుతున్నా’’ అని రోహిణి ఖడ్సే తన లేఖలో ప్రస్తావించారు. దేశాన్ని రక్షించుకునేందుకు మహారాణి తారా రాణి, పుణ్య శ్లోక అహల్యాదేవి హోల్కర్ వంటి వారు కత్తి బయటకు తీశారని, కాబట్టి మెరుగైన సమాజం కోసం తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రోహిణి ఖడ్సే కోరారు.

మహిళలు పర్సుల్లో కారం పొడి, కత్తులు తీసుకెళ్లాలి.. మహారాష్ట్ర మంత్రి 

Advertisement

మహిళలు ఆత్మరక్షణ కోసం తమ పర్సుల్లో లిప్‌స్టిక్‌లతో పాటు కత్తులు, కారం పొడి (Chilli powder) తీసుకెళ్లాలని మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్‌రావ్ పాటిల్ (Gulab Rao Patil) సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

‘‘మహిళా సాధికారతపై నిరంతరం మాట్లాడుతున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే (Bal Thackeray) ఓ సందర్భంగా మాట్లాడుతూ..  మహిళలు తమ వెంట కారం పొడి, రాంపురి కత్తిని తీసుకెళ్లాలని చెప్పారు. అందుకు ఆయనను జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. కానీ నేటికీ ఆ పరిస్థితి అలాగే ఉంది. యువతులు స్వీయ రక్షణ కోసం అలాంటి వస్తువులనే తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి’’ అని మంత్రి గులాబ్ రావ్ వ్యాఖ్యానించారు.

మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోదని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×