BigTV English
Advertisement

Sabarimala Devotees Insurance : శబరిమల భక్తులకు ఉచిత ప్రమాద బీమా.. నష్టపరిహారం ఎంతంటే?..

Sabarimala Devotees Insurance : శబరిమల భక్తులకు ఉచిత ప్రమాద బీమా.. నష్టపరిహారం ఎంతంటే?..

Sabarimala Devotees Insurance | కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల్లో అయ్యప్ప భక్తులు మరణించడంతో, ఈ దుర్ఘటనల నేపథ్యంలో దేవస్థానం ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ బీమా పథకం ప్రకారం, యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తుంది.


మండలం మకర విలక్కు సీజన్ సమీపించడంతో, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా, కొల్లం, అల్లప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో ప్రమాదంలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందుతుంది. ఇందుకోసం భక్తుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయబడలేదు.

వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి యాత్రికుడికి ఈ ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన ఒప్పందం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో కుదుర్చుకుంది. అదనపు జిల్లాలకు ఈ బీమా పథకాన్ని విస్తరించే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు.


శబరిమలలో పనిచేసే కార్మికుల కోసం కూడా మరో బీమా పథకాన్ని ప్రారంభించింది దేవస్థానం బోర్డు. ఈ పథకం ప్రకారం, శబరిమల ఆలయాన్ని శుభ్రపరిచే విశుధి కార్మికులు, పంపా నుంచి సన్నిధానం వరకు భక్తులను తీసుకుని వచ్చే డోలీ కార్మికులకు కూడా పరిహారం అందించబడుతుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిగా వైకల్యం అయితే రూ. 10 లక్షల పరిహారం, పాక్షిక వైకల్యానికి రూ. 5 లక్షల పరిహారం అందించబడుతుంది. ఈ బీమా పథకానికి భారతీయ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సహకారం అందిస్తోంది.

Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు

కానీ, ఈ బీమా పథకంలో కార్మికులు రూ. 499 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, ఈ స్కీములో వారి పిల్లలకు వైద్య బీమా, విద్య వంటి మరిన్ని ప్రయోజనాలను అందించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. భక్తుల మరియు కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడమే ఈ బీమా పథకాల ప్రధాన ఉద్దేశ్యం అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×