E-Paper
Advertisement

Severe Heatwave in India: బి అలర్ట్.. వచ్చే 5 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఈ రాష్ట్రాల్లోనే!

Severe Heatwave in India: బి అలర్ట్.. వచ్చే 5 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఈ రాష్ట్రాల్లోనే!
Advertisement

IMD Warns Severe Heatwave in Across the India : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మొదలు సాయంత్రం 7 అయినా కూడా ఆ ఎండ వేడిమి తగ్గట్లేదు. మధ్యాహ్నం సమయంలోనైతే కనీసం అడుగు బయటపెట్టాలంటేనే జనం అల్లాడుతున్నారు. అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే… ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ తాజాగా ఓ సూచన చేసింది. మరో ఐదురోజులపాటు ఎండలు మండిపోనున్నాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో బహర్గోరా జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.

అయితే, వచ్చే 5 రోజులపాటు బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, యూపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు పలు యూనియన్ టెర్రీటరీస్ లలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురువొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Advertisement

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఝార్కండ్ ప్రభుత్వం పాఠశాలల సమయ వేళల్లో మార్పులు చేసింది. ఇటు ఒడిశా సర్కారు సమ్మర్ వెకేషన్స్ ను ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఎండాకాలం సెలవులని పేర్కొన్నది. అదేవిధంగా ఈ మూడు రోజులపాటు కూడా పాఠశాలల సమయ వేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే.

Also Read: భానుడి ప్రతాపం.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయ్..

Advertisement

రాష్ట్రంలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండలకు భయపడి పనులకు వెళ్లేవారు ఉదయాన్నే వెళ్తున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లేవాళ్లు ఎండల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పగలంతా తీవ్రమైన ఎండ, రాత్రి పూట ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×